News January 18, 2025

పవన్ ఆఫీస్‌పై డ్రోన్.. డీజీపీకి ఫిర్యాదు

image

AP: మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 1.50 గంటల మధ్య డ్రోన్ ఆ ప్రాంతంలో తిరిగింది. దీంతో జనసేన నేతలు డీజీపీతోపాటు గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News November 17, 2025

జగిత్యాల: EVMల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

image

ధరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక వ్యవస్థలను ఈ సందర్భంగా ఆయన సమగ్రంగా పరిశీలించారు. గోదాములో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News November 17, 2025

MDK: నిరుపేదలకు అండగా మంత్రి దామోదర్

image

మెదక్ జిల్లాలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన ఎండీ.ఇర్ఫాన్ గత కొన్నిరోజులుగా కిడ్నీల సంబందిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ తక్షణమే స్పందించి ఉస్మానియా హాస్పిటల్ సంబంధిత వైద్యులతో తానే మాట్లాడి, మెరుగైన వైద్యం కోసం స్వయంగా అంబులెన్స్ పంపి ఉస్మానియా హాస్పటల్‌కి పంపించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం తన బాధ్యత అని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

News November 17, 2025

గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలా?

image

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.