News May 24, 2024
మోదీ విజయవాడ రోడ్షోలో డ్రోన్లు.. కేంద్రం ఆగ్రహం

AP: ఈ నెల 8న ప్రధాని మోదీ విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా రెండు డ్రోన్లు ఆ పరిధిలోకి రావడాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. భద్రతా లోపంపై వివరణ ఇవ్వాలని DGP, CSను ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావొద్దని స్పష్టం చేసింది. మోదీ రోడ్ షో సాగే ప్రాంత గగనతలంలో 2KM మేర రెడ్ జోన్గా ప్రకటించారు. అయితే PM రాకకు 45 నిమిషాల ముందు 2 డ్రోన్లు సంచరించాయి.
Similar News
News December 13, 2025
₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్

దేశంలో రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2009-14 మధ్య 7,599 KM న్యూ ట్రాక్ వేస్తే, 2014-24 వరకు తాము 34,428 KM నిర్మించామని తెలిపారు. ₹6,74,920 కోట్లతో కొత్త రైల్వే లేన్లు, మల్టీ ట్రాకింగ్, గేజ్ కన్వర్షన్ చేపట్టామన్నారు. ఇప్పటికే 12,769 KMల నిర్మాణం పూర్తయిందన్నారు. పెరుగుతున్న సరకు రవాణా దృష్ట్యా నెట్వర్క్ కెపాసిటీ పెంచుతున్నామని చెప్పారు.
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
బిగ్బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్లో సంజన/భరణి/డెమోన్ పవన్లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.


