News March 5, 2025

నాపై కేసులను కొట్టేయండి.. హైకోర్టులో పోసాని పిటిషన్లు

image

AP: తనపై కర్నూలు, పాతపట్నం, విజయవాడ, ఆదోనిలో నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ‘మతం, జాతి, నివాసం, భాష ఆధారంగా విద్వేషాలను రెచ్చగొట్టేలా నేను వ్యాఖ్యలు చేయనందున BNS సెక్షన్ 196(1) కింద కేసు నమోదు చెల్లదు. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించారు. 41A కింద నోటీసు ఇచ్చి వివరణ మాత్రమే తీసుకోవాలి’ అని కోరారు.

Similar News

News December 15, 2025

నరసాపురం వరకు వందేభారత్.. నేడే ప్రారంభం

image

AP: చెన్నై సెంట్రల్-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ నేటి నుంచి నరసాపురం వరకు నడవనుంది. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నరసాపురం రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి చెన్నై వెళ్లే రైలును ప్రారంభిస్తారు. షెడ్యూల్.. చెన్నై నుంచి రైలు(20677) 5.30AMకు బయలుదేరి 11.45AMకు విజయవాడ వస్తుంది. గుడివాడ, భీమవరం మీదుగా 2.10PMకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ట్రైన్(20678) 2.50PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.

News December 15, 2025

ఆవుండగా గాడిద పాలు పితికినట్లు

image

ఒక పనిని సులభంగా, సరైన మార్గంలో చేసే అవకాశం లేదా వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిని విస్మరించి, కష్టమైన, పనికిరాని, అసాధ్యమైన మార్గాన్ని ఎంచుకున్న సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అందుబాటులో ఉన్న మంచి అవకాశాన్ని వదులుకుని అనవసరమైన శ్రమకు పోవడాన్ని ఈ సామెత సూచిస్తుంది.

News December 15, 2025

భజన పాటలు వింటున్నారా?

image

లైవ్‌లో భజన పాటలు వినడం, పాడటం వల్ల ఎన్నో లాభాలున్నాయట. ఆ పాటలు వింటున్నప్పుడు మన మనసు సానుకూల శక్తిని గ్రహించి, ప్రతికూల శక్తులను బయటకు పంపుతుందట. లయబద్ధమైన శబ్దం మానసిక చికిత్సగా పనిచేసి మన ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుందట. వీటికి మనలోని ఏకాగ్రతను పెంచే శక్తి ఉందని నమ్ముతారు. డోపమైన్ విడుదల చేసి, మన భావోద్వేగ స్థిరత్వాన్ని సైతం పెంచుతాయని డాక్టర్లు చెబుతున్నారు. సామూహిక భజనలు బంధాలను పెంచుతాయి.