News December 23, 2024

విధానం రద్దుతో డ్రాపౌట్స్: UTF

image

నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేయడంపై తెలంగాణ UTF స్పందించింది. ఈ విధానం రద్దు చేయడం వల్ల స్కూళ్లలో డ్రాపౌట్స్ పెరుగుతాయని, పేదలకు విద్య దూరమవుతుందని అభిప్రాయపడింది. దీని వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Similar News

News October 16, 2025

భట్టి విక్రమార్కతో కొండా సురేఖ భేటీ

image

TG: ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత భేటీ అయ్యారు. నిన్న రాత్రి నుంచి జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. కాసేపట్లో ప్రారంభం కానున్న క్యాబినెట్ భేటీకి మంత్రి సురేఖ హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా రెడ్డి వర్గమంతా కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత <<18019826>>ఆరోపించిన<<>> సంగతి తెలిసిందే.

News October 16, 2025

కోహ్లీ ట్వీట్‌పై విమర్శలు.. ఎందుకంటే?

image

ఆస్ట్రేలియాకు వెళ్లిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ‘పోరాటాన్ని ఆపినప్పుడే ఓడిపోయినట్లు’ అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన ఆటగాడు గివప్ ఇవ్వరంటూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇది యాడ్ కోసం చేసిన ట్వీట్ అని తెలియడంతో చాలామంది అసంతృప్తికి లోనయ్యారు. తమ అభిమానంతో ఆడుకోవడం కరెక్టేనా? అని మండిపడ్డారు. ఇది యాడ్ పోస్ట్ అని ముందే తెలుసంటూ మరికొందరు పేర్కొన్నారు.

News October 16, 2025

అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది: మోదీ

image

AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తోందని ప్రధాని మోదీ కర్నూలు జీఎస్టీ సభలో అభినందించారు. ‘చంద్రబాబు చెప్పినట్లు 2047 నాటికి కచ్చితంగా మన దేశం వికసిత్ భారత్‌గా మారుతుంది. ఏపీలో ఎన్నో అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉంది. సైన్స్, ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉంది. ఈ రాష్ట్రానికి కేంద్రం పూర్తి మద్దతు ఉంది’ అని పేర్కొన్నారు.