News April 3, 2024

కరవు వచ్చింది.. ఊరు తేలింది

image

TG: వేసవి ఆరంభంలోనే రాష్ట్రాన్ని కరవు ఛాయలు కమ్ముకున్నాయి. మిడ్ మానేరు ప్రాజెక్టులో నీరు తగ్గడంతో ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇప్పుడు కుడి, ఎడమ కాలువలతో పాటు లోయర్ మానేర్ డ్యామ్‌కు నీటిని విడుదల చేస్తుండటంతో మిడ్ మానేరు ప్రాజెక్టులో నీరు తగ్గింది. ఇన్నాళ్లు నీటిలో మునిగి ఉన్న ముంపు గ్రామాల్లోని ఇళ్లు, స్కూళ్లు, ఆలయాలు బయటపడుతున్నాయి.

Similar News

News March 7, 2026

రేపు కెప్టెన్ సూర్య రిటైర్మెంట్?

image

INDT20 జట్టు కెప్టెన్ సూర్య రేపు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. కివీస్‌తో జరిగే T20WC ఫైనల్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఫామ్ తగ్గడం, వయసు పెరగడం(35 ఏళ్లు), కెరీర్ చివరి దశలో ఉన్నందున రిటైర్మెంట్‌కు ఇదే మంచి తరుణమని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా SKY కెప్టెన్సీలో IND ఒక్క సిరీసూ ఓడిపోలేదు. అయితే బ్యాటర్‌గా విఫలమవుతున్నారు.

News March 7, 2026

8 మంది MLAలకు క్లీన్ చిట్

image

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పును ఆయన రిజర్వ్ చేశారు.

News March 7, 2026

దేశంలోనే అతిపెద్ద లొంగుబాటు: రేవంత్

image

TG: దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద మావోయిస్టు <<19321592>>లొంగుబాటు<<>> అని CM రేవంత్ అన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న మిగతావాళ్లంతా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. గణపతి రక్షణ, ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోలకు ఆరోగ్య, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నామన్నారు. మావోలు లేవనెత్తిన రాష్ట్ర పరిధిలోని అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.