News October 17, 2024
డ్రగ్స్, గంజాయి అమ్మేవారు సంఘ విద్రోహులే: సీఎం

APలో డ్రగ్స్ నియంత్రణపై ఉక్కుపాదం మోపుతామని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. హోంమంత్రి అనిత నేతృత్వంలో దీనిపై ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. DIG రవికృష్ణ నేతృత్వంలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్ నియమించి, 600 మంది సిబ్బందిని కేటాయిస్తున్నామన్నారు. డ్రగ్స్, గంజాయి విక్రయించే వారిని సంఘ విద్రోహులుగా ప్రకటిస్తామన్నారు. అక్రమ మద్యం తీసుకొస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News December 7, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <
News December 7, 2025
సర్పంచ్గా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చో తెలుసా?

TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేయవచ్చు. అన్ని/ఏదో ఒక చోట గెలిస్తే ఒక స్థానాన్ని ఎంచుకుని, మిగతా చోట్ల రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో అలా కుదరదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానంలో మాత్రమే పోటీ చేయడానికి పర్మిషన్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల బరిలోకి దిగితే పోటీ చేసిన అన్ని చోట్లా అనర్హుడిగా ప్రకటిస్తారు.
Share It
News December 7, 2025
15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే: లోకేశ్

AP: గుజరాత్, ఒడిశాలో ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల అభివృద్ధి జరిగిందని.. రాష్ట్రంలోనూ 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మంత్రి లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ‘కలిసికట్టుగా పనిచేస్తామని పవనన్న పదేపదే చెబుతున్నారు. విడాకులు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని డలాస్ తెలుగు డయాస్పొరా సమావేశంలో లోకేశ్ తెలిపారు.


