News December 21, 2024
ఎండు కొబ్బరి MSP రూ.422 పెంపు: కేంద్రం

వచ్చే 2025 సీజన్లో ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర (MSP) క్వింటాల్కు రూ.422 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో క్వింటాల్ ధర రూ.12,100కి చేరనుంది. ఇందుకోసం రూ.855 కోట్లు కేటాయించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. బంతి కొబ్బరి MSP రూ.100 పెంచనున్నట్లు తెలిపింది. ఎండు కొబ్బరి ఉత్పత్తి దేశంలో అత్యధికంగా కర్ణాటకలో (32.7%) జరుగుతుండగా, ఏపీలో 7.7%గా ఉంది.
Similar News
News February 2, 2026
జగిత్యాల: ‘ఈనెల 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి’

జిల్లాలోని దివ్యాంగులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దివ్యాంగుల పరికరాల కోసం ఈనెల 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. శారీరక దివ్యాంగులు, అందులు, బధిరులకు బ్యాటరీ వీల్ చైర్స్ అటాచ్మెంట్, ల్యాప్ టాప్స్, ట్యాబ్ ఉచిత పంపిణీ చేయుటకు దరఖాస్తు తేదీని పొడిగించినట్లు చెప్పారు. అర్హులైన వారు సంబంధిత పత్రాలతో వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News February 2, 2026
గోదావరిలో దూకబోయిన యువకుడిని కాపాడిన పోలీసులు

కుటుంబంలో కలహాలతో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని ఆలమూరు పోలీసులు టెక్నాలజీ సాయంతో కాపాడారు. ఆత్రేయపురం పెద్దపేటకు చెందిన కాలా బత్తుల రవి కిరణ్ గోదావరిలో దూకుతున్నానని ఆదివారం తన సోదరి చిన్నారికి ఫోన్ చేశాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు. రవి కిరణ్ ఆచూకీ కనిపెట్టి, రక్షించారు.
News February 2, 2026
హుజురాబాద్: మొదలైన బుజ్జగింపులు.. లేదంటే బేరసారాలు!

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన రెబెల్ అభ్యర్థులను తప్పుకోవాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బుజ్జగిస్తున్నాయి. 30 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 53, బీజేపీ నుంచి 48, బీఆర్ఎస్ నుంచి 39 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అదనంగా ఉన్న అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు బలంగా సాగుతున్నాయి. బుజ్జగింపులకు లొంగని వారితో నేతలు బేరసారాలు ప్రారంభించారు.


