News June 12, 2024

డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు

image

TG: టెట్‌లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు టెట్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించింది. ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి.

Similar News

News December 12, 2025

HEADLINES

image

* తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
* హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు.. కొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్
* రైతుల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్: CM CBN
* ట్రంప్‌కు PM మోదీ ఫోన్.. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు
* పనితీరు మారాలంటూ TBJP ఎంపీలకు PM మోదీ హితబోధ
* సౌతాఫ్రికాతో రెండో టీ20లో భారత్ ఓటమి

News December 12, 2025

సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం: లోకేశ్

image

‘అఖండ-2’లో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులను కనువిందు చేయనుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘God of Masses మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం. ఈ మూవీ అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నా. 5 దశాబ్దాల సినీ చరిత్రలో మరో ఘనవిజయం సొంతం చేసుకోబోతున్న మామయ్యకు అభినందనలు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అఖండ-2 రేపు విడుదల కానుండగా, ఇప్పటికే ప్రీమియర్స్ మొదలయ్యాయి.

News December 12, 2025

భారీ మెజార్టీతో BRS బలపరిచిన అభ్యర్థి గెలుపు

image

TG: ములుగు(D) ఏటూరు నాగారం సర్పంచ్‌గా BRS బలపరిచిన కాకులమర్రి శ్రీలత గెలుపొందారు. ప్రత్యర్థి గుడ్ల శ్రీలతపై 3వేల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఓట్లు 8,333 పోలయ్యాయి. BRS బలపరిచిన అభ్యర్థికి 5,520, కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థికి 2,330 ఓట్లు వచ్చాయి. మంత్రి సీతక్క ఇక్కడ 5 సార్లు ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవలేకపోయిందని BRS నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.