News March 18, 2024
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలి: ఎమ్మెల్సీ లక్ష్మణరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేశ్ కుమార్ మీనాను సచివాలయంలో సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కలిసారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు జరిగే డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయించాలని వినతి పత్రం అందించారు. అభ్యర్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించాలని ప్రిపరేషన్కు తగిన సమయం ఉండేలా చూడాలని కోరారు.
Similar News
News February 6, 2026
కృష్ణా: SSC పరీక్ష ఫీజు చెల్లింపునకు మరో అవకాశం

పదో తరగతి (SSC) విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ SSC ఎగ్జామినేషన్ బోర్డు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి గురువారం తెలిపారు. పరీక్ష ఫీజును ఇప్పటివరకు చెల్లించని విద్యార్థులు రూ.1000ల అపరాధ రుసుంతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఈ తత్కాల్ పథకం ఈనెల 6 నుంచి 12 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
News February 5, 2026
నేలపై కూర్చున్న కృష్ణాజిల్లా కలెక్టర్

మచిలీపట్నంలోని ఎస్ఎన్ గొల్లపాలెం పంచాయతీ పరిధిలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అక్షర ఆంధ్ర (ఉల్లాస్)’ కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. అనంతరం ఆయన నేలపై కూర్చుని తరగతుల నిర్వహణ, హాజరు, బోధనా విధానాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. వయోజనులు చదువుతో స్వావలంబన సాధించాలన్నారు. అక్షరాస్యత కుటుంబం, సమాజ అభివృద్ధికి దోహదమని సూచించారు.
News February 5, 2026
కష్ణాజిల్లాలో 6 బార్ల ఎంపిక

జిల్లా వ్యాప్తంగా మిగిలిపోయిన బార్ లైసెన్సుల కోసం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మచిలీపట్నం లాటరీ విధానాన్ని నిర్వహించారు. మొత్తం 11 బార్లలో 6 బార్లకు 37 దరఖాస్తులు వచ్చాయన్నారు. గురువారం లాటరీ విధానం ద్వారా మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో 5 బార్లు, గుడివాడ మున్సిపాలిటీలో 1 బారుకు లైసెన్సులు మంజూరు చేశారు. గుడివాడలో 4, పెడనలో 1 బార్కు దరఖాస్తులు లేకపోవడంతో వాటి లాటరీని రద్దు చేశారు.


