News October 9, 2024
డీఎస్సీ: ఎంత మంది ఎంపికయ్యారంటే?

TG: డీఎస్సీ పోస్టుల తుది ఫలితాలను విద్యాశాఖ రిలీజ్ చేసింది. మొత్తం 11 వేల 62 పోస్టులకు గానూ 10,006 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను వెల్లడించింది. మిగిలిన అభ్యర్థుల ఎంపిక పెండింగ్లో ఉన్నట్లు పేర్కొంది. ఆ పోస్టుల్లో ఎంపికైన క్యాండిడేట్లు కోర్టు కేసులు, ఇతర కారణాలు ఉండటంతో పెండింగ్లో ఉన్నట్లు తెలిపింది.
Similar News
News January 6, 2026
శ్రీవాణి దర్శన టికెట్లు ఇక ఆన్లైన్లోనే

తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్లైన్లో జారీ చేయడాన్ని TTD నిలిపేసింది. ఈ నెల 9 నుంచి రోజూ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో 800 టికెట్లను కేటాయించనుంది. ఉ.9 గంటలకు విడుదల చేయనుంది. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సా.4 గంటలకు దర్శనానికి రిపోర్ట్ చేయాలి. ఈ విధానాన్ని నెల రోజులు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఒక కుటుంబానికి నలుగురు(1+3) సభ్యులకే టికెట్ బుకింగ్కు అనుమతి ఉంటుంది.
News January 6, 2026
అమెరికాలో పుట్టి.. HYDకు ఆడుతున్నాడు

VHTలో డబుల్ సెంచరీ బాదిన <<18778738>>అమన్ <<>>రావు అమెరికాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కరీంనగర్కు చెందినవారు కాగా ఉద్యోగ నిమిత్తం USకు వెళ్లారు. HYDలో పెరిగిన అమన్ క్రికెట్పై మక్కువ పెంచుకొని దేశవాళీలో సత్తా చాటుతున్నారు. VHTలో హైదరాబాద్ తరఫున డబుల్ సెంచరీ బాదిన తొలి, ఓవరాల్గా తొమ్మిదో ప్లేయర్. ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. IPL-2026 మినీ వేలంలో అమన్ను RR ₹30Lakhsకు కొనుగోలు చేసింది.
News January 6, 2026
డబ్బులివ్వకుంటే సిబ్బందికి జీతాలెలా: KRMB

AP, TG ప్రభుత్వాల తీరుపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 3 త్రైమాసికాలుగా బోర్డుకు నిధులు విడుదల చేయకపోవడంపై ఆగ్రహించింది. FY25-26లో ఎలాంటి నిధులూ ఇవ్వకపోవడంపై 2 రాష్ట్రాల ఇరిగేషన్ ENCలకు లేఖ రాసింది. సిబ్బందికి జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. కాగా టెలిమెట్రీ ఫేజ్2 కోసం TG అందించిన రూ.4.15CRను మళ్లించి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు.


