News November 16, 2024

నేటి నుంచి డీఎస్సీ ఉచిత శిక్షణ

image

AP: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో నేటి నుంచి డీఎస్సీకి ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. వారికి ట్రైనింగ్ సమయంలో నెలకు ₹1,500 స్టైఫండ్, మెటీరియల్ కోసం ₹1,000 ఇస్తామన్నారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా DSCని విడుదల చేస్తామని తెలిపారు. కాగా ప్రభుత్వం 5,200 మంది BC, SC, STలకు, 520 మంది EWS అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్‌ ఇవ్వనుంది.

Similar News

News September 14, 2025

వరి: సెప్టెంబర్‌లో ఎరువుల యాజమాన్యం ఇలా..

image

తెలుగు రాష్ట్రాల్లో వరినాట్లు దాదాపు <<17675869>>పూర్తయ్యాయి<<>>. పంట వివిధ దశల్లో ఉంది. పిలక దశలో ఉన్న పైర్లలో ఎకరానికి 35KGల యూరియాను బురద పదునులో చల్లుకోవాలి. అంకురం దశలో ఉంటే 35KGల యూరియాతోపాటు 15KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును వేసుకోవాలి. పిలకలు వేసే దశలో పొలంలో కనీసం 2CM వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. కాగా ఈ నెలలో వరినాట్లు వేయరాదు. వేస్తే పూత దశలో చలి వల్ల గింజ పట్టక దిగుబడిపై ప్రభావం చూపుతుంది.

News September 14, 2025

టారిఫ్ వార్: ట్రంప్‌కు చైనా స్ట్రాంగ్ కౌంటర్

image

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు చైనాపై 50-100% టారిఫ్స్ వేయాలని ట్రంప్ నిన్న NATOకు <<17700504>>లేఖ<<>> రాసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్‌కు చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మేం యుద్ధాలను సృష్టించం.. పాల్గొనం. యుద్ధాలతో సమస్యలను పరిష్కరించలేం. ఆంక్షలు వాటిని మరింత క్లిష్టతరం చేస్తాయి’ అని స్పష్టం చేశారు. కాగా చైనా ముందు నుంచి ట్రంప్ చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.

News September 14, 2025

రోజురోజుకూ పడిపోతున్న ఉల్లి ధరలు

image

AP: కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు పాతాళం వైపు పయనిస్తున్నాయి. రైతుల వద్ద క్వింటాను మార్క్‌ఫెడ్ రూ.1,200కు కొనుగోలు చేయగా నిల్వలు పెరిగిపోయాయి. కొత్త సరకు వస్తే దించుకోవడానికి స్థలం లేకపోవడంతో తమ వద్ద ఉన్న స్టాకును కొనాలని వ్యాపారులను మార్క్‌ఫెడ్ కోరింది. తొలుత ఆసక్తి చూపని వ్యాపారులు ఆపై నాణ్యతను బట్టి క్వింటా రూ.50 నుంచి రూ.450 వరకు కొన్నారు. 800 టన్నుల వరకు కొనుగోళ్లు జరిగాయి.