News April 9, 2025

దుబాయ్ టు ముంబై.. సముద్రంలో బుల్లెట్ ట్రైన్!

image

దుబాయ్ నుంచి ముంబైకి అండర్ వాటర్ బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ ప్లాన్ చేస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. హైపర్‌లూప్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో అరేబియన్ సముద్రంలో అల్ట్రా-హై స్పీడ్ ట్రైన్ రానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దుబాయ్-ముంబై మధ్య 2వేల కి.మీ దూరాన్ని 2 గంటల్లో చేరుకోవచ్చు.

Similar News

News December 3, 2025

రేపే దత్త జయంతి.. ఏం చేయాలంటే?

image

త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయస్వామి. అందుకే ఆయనకు 3 తలలుంటాయి. రేపు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయనను పూజిస్తే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆరాధనా ఫలితం దక్కుతుందని నమ్మకం. ఆయన చిత్రపటం, విగ్రహానికి పసుపు రంగు పూలతో అలంకరించి, పులిహోరా, నిమ్మకాయలు వంటి పసుపు రంగు నైవేద్యాలు సమర్పిస్తే.. శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున ఆయన అనుగ్రహం పొందితే జీవితంలో శుభాలు కలుగుతాయి.

News December 3, 2025

భారత్ సిరీస్ పట్టేస్తుందా?

image

IND, SA మధ్య నేడు రాయ్‌పూర్‌లో రెండో వన్డే జరగనుంది. 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఇవాళ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు సిరీస్ ఫలితాన్ని 3వ వన్డేకు వాయిదా వేయాలనే పట్టుదలతో సఫారీ జట్టు ఉంది. గాయంతో తొలి వన్డేకు దూరమైన బవుమా జట్టులో చేరే ఆస్కారం ఉంది. రోహిత్, కోహ్లీ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. సుందర్ ప్లేస్‌లో తిలక్ జట్టులోకి రావొచ్చని టాక్. మ్యాచ్ 1.30PMకు మొదలవుతుంది.

News December 3, 2025

సూతకం అంటే మీకు తెలుసా?

image

ఓ ఇంట్లో జననం లేదా మరణం జరిగినప్పుడు పాటించే అశుభ్రత కాలాన్ని సూతకం అంటారు. కొత్త జననం జరిగినప్పుడు శిశువుకు, తల్లికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ శుద్ధి అయ్యే వరకు జనన సతకం ఉంటుంది. అలాగే, కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. వారి ఆత్మ శాంతించే వరకు కొన్ని రోజుల పాటు మరణ సూతకం పాటిస్తారు. ఈ సూతక కాలంలో ఇంటి సభ్యులు దేవాలయాలకు వెళ్లరు. శుభకార్యాలు, పూజలు వంటివి చేయరు.