News August 14, 2024
జగన్ తప్పిదాలతోనే ఆరోగ్యశ్రీ బకాయిలు: మంత్రి సత్యకుమార్

AP: ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పాలన గాడిలో పడుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జగన్ తప్పిదాలతోనే ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు పడ్డాయని విమర్శించారు. తాము 2 నెలల్లోనే ఆస్పత్రులకు బకాయిలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కోల్కతాలో డాక్టర్ హత్య ఘటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News November 18, 2025
నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CBN

AP: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CM CBN, మంత్రి లోకేశ్కు ఆహ్వానం అందింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి అక్కడ 202 సీట్లు సాధించడం తెలిసిందే. సభానేతగా నితీశ్కే మళ్లీ అవకాశం దక్కింది. 20న పట్నాలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఆహ్వానం అందడంతో CBN, లోకేశ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బిహార్ ఎన్నికల్లో లోకేశ్ NDA తరఫున ప్రచారం చేశారు.
News November 18, 2025
నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CBN

AP: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CM CBN, మంత్రి లోకేశ్కు ఆహ్వానం అందింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి అక్కడ 202 సీట్లు సాధించడం తెలిసిందే. సభానేతగా నితీశ్కే మళ్లీ అవకాశం దక్కింది. 20న పట్నాలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఆహ్వానం అందడంతో CBN, లోకేశ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బిహార్ ఎన్నికల్లో లోకేశ్ NDA తరఫున ప్రచారం చేశారు.
News November 18, 2025
960 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TG: వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న కోర్టుల్లో 960 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిలో 23 అదనపు కోర్టు మేనేజర్ పోస్టులు, మరిపెడలో 27, హన్మకొండ, హుజూర్ నగర్, సుల్తానాబాద్, దేవరకద్ర, భీమగల్, సంగారెడ్డి, భూపాలపల్లిలో 196, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 617, 5 ఫస్ట్ క్లాస్ కోర్టుల్లో 97 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.


