News August 30, 2024

జగన్ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టులకు గండ్లు: మంత్రి నిమ్మల

image

AP: కృష్ణా నదికి వరద పోటెత్తడంతో సాగర్ కుడికాలువ ఆయకట్టుకు 15రోజుల ముందుగానే సాగునీరు విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టులకు గండ్లు పడుతున్నాయి. చింతలపూడి పథకాన్ని పట్టించుకోలేదు. ఇది పూర్తయితే ప.గో, కృష్ణా జిల్లాల్లోని 4.80లక్షల ఎకరాలకు సాగునీరు, 26లక్షల మందికి తాగునీరు అందుతుంది’ అని చెప్పారు.

Similar News

News November 4, 2025

సైన్యాన్ని కూడా ఆ 10% మందే నియంత్రిస్తున్నారు: రాహుల్

image

బిహార్ ఎన్నికల ప్రచారంలో CONG నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. ‘దేశంలోని 10% జనాభాకే (అగ్రవర్ణాలు) కార్పొరేట్ సెక్టార్, బ్యూరోక్రసీ, జుడీషియరీలో అవకాశాలు దక్కుతున్నాయి. చివరకు ఆర్మీ కూడా వారి కంట్రోల్‌లోనే ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 90% ఉన్న SC, ST, BC, మైనారిటీలు కనిపించరని పేర్కొన్నారు. కాగా భారత సైనికుల్ని చైనా సైన్యం కొడుతోందని ఇదివరకు RG కామెంట్ చేయగా SC మందలించింది.

News November 4, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

✒ మోకాలి గాయంతో బిగ్‌బాష్ లీగ్‌ సీజన్‌-15కు అశ్విన్ దూరం
✒ రంజీ ట్రోఫీ: రాజస్థాన్‌పై 156 రన్స్ చేసిన ముంబై బ్యాటర్ యశస్వీ జైస్వాల్
✒ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్: IND-A కెప్టెన్‌గా జితేశ్ శర్మ, జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
✒ ICC ఉమెన్స్ ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నం.1గా లారా వోల్వార్డ్ట్.. రెండో స్థానానికి చేరిన స్మృతి మంధాన
✒ U19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి ఎంపికైన ద్రవిడ్ కుమారుడు అన్వయ్

News November 4, 2025

జూబ్లీ గెలుపుపై రోజుకో సర్వే వెనుక రహస్యమేమి?

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రోజుకో సర్వే విడుదలవుతోంది. ఇప్పటి వరకు 3 సర్వే సంస్థల నివేదికలు బయటకు వచ్చాయి. గెలుపుపై 2 బీఆర్ఎస్‌కు, 1 కాంగ్రెస్‌కు అనుకూలంగా చెప్పాయి. ఇవి వివాదంగా మారగా 2పార్టీలూ అధికారులకు ఫిర్యాదు చేశాయి. అయితే అనుకూలతను పెంచుకొనేందుకు పార్టీలే ఇలా సర్వే సంస్థల ద్వారా కొత్త ప్రచారం మొదలుపెట్టాయని కొందరు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల ప్రభావం తటస్థ ఓటర్లపై పడొచ్చని అంటున్నారు.