News June 28, 2024
ట్రైన్లో ఒకరి అజాగ్రత్త వల్ల నిండు ప్రాణం బలి!
ట్రైన్లో ఓ వ్యక్తి అజాగ్రత్తగా ఉండటం వల్ల తోటి ప్రయాణికుడు మరణించాడు. ఎర్నాకులం-హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ స్లీపర్ కోచ్లో కేరళకు చెందిన అలీఖాన్ స్నేహితుడితో కలిసి ఆగ్రాకు వెళ్తున్నాడు. ఆయన దిగువ బెర్త్లో పడుకోగా మిడిల్ బెర్త్లో ఉన్న వ్యక్తి సీటు చైన్లు సరిగా బిగించలేదు. దీంతో పై బెర్త్ ఆయనపై పడిపోయింది. తీవ్ర గాయాలైన అలీఖాన్ HYDలోని రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
Similar News
News September 20, 2024
నందిగం సురేశ్ ఇంట్లో సోదాలు
AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పోలీసు కస్టడీలో ఆయన వెల్లడించిన సమాచారం ఆధారంగా గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన ఆయనకు కోర్టు తాజాగా మరో 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
News September 20, 2024
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ: నేడే తొలి మ్యాచ్
మాజీ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఇవాళ్టి నుంచి జరగనుంది. నేడు తొలి మ్యాచులో రాత్రి 7 గంటలకు కోణార్క్ సూర్యాస్, మణిపాల్ టైగర్స్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ధవన్, ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ తదితర మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, ఫ్యాన్ కోడ్ యాప్లో ఈ మ్యాచులను చూడవచ్చు.
News September 20, 2024
ఆయుధాలు వదిలేసి సరెండర్ కండి: అమిత్ షా
నక్సల్స్ హింసను విడనాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలేసి సరెండర్ కావాలని సూచించారు. తన ప్రతిపాదనను పట్టించుకోకపోతే నక్సల్స్పై ఆలౌట్ ఆపరేషన్ మొదలుపెడతామని అమిత్ షా హెచ్చరించారు.