News August 1, 2024
ప్రైవేట్ ఏజెన్సీల బకాయిలు రూ.1025 కోట్లు: సీఎంతో అధికారులు

AP: ఉచిత ఇసుక విధానంలో వినియోగదారులకు భారం లేకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మైనింగ్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో మైనింగ్ శాఖపై 7 శాతం ఆదాయమే వచ్చినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు చెల్లింపులు చేయలేదన్నారు. ప్రభుత్వానికి రూ.1025 కోట్లు చెల్లించలేదని తేల్చారు. ఈ అక్రమాలపై కేసులు నమోదు చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు.
Similar News
News January 20, 2026
TN గవర్నర్ వాకౌట్కు కారణాలివే: లోక్భవన్

TN అసెంబ్లీ నుంచి గవర్నర్ RN రవి వాకౌట్ చేయడానికి గల కారణాలను లోక్భవన్ వెల్లడించింది. ‘గవర్నర్ ప్రసంగిస్తుండగా పలుమార్లు మైక్రోఫోన్ ఆఫ్ చేశారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించే స్టేట్మెంట్లు, ఆధారాలు లేని ఆరోపణలు ఉన్నాయి. నేరాల పెరుగుదల, 55% పెరిగిన POCSO కేసులు, 33% పెరిగిన లైంగిక వేధింపుల వంటి అనేక సమస్యలను ప్రసంగంలో ప్రస్తావించలేదు’ అని స్టేట్మెంట్లో పేర్కొంది.
News January 20, 2026
మూవీ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

TG: సినిమా టికెట్ ధరల <<18819916>>పెంపుపై<<>> తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. MSVPG టికెట్ ధరల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విషయమై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, <<18817219>>సీవీ ఆనంద్<<>>కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇకపై మూవీ టికెట్ ధరల పెంపుపై 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
News January 20, 2026
రోహిత్, కోహ్లీకి బీసీసీఐ షాక్ ఇవ్వనుందా?

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వార్షిక కాంట్రాక్టుల్లో టైర్-2కు డిమోట్ చేయనుందని సమాచారం. 4 టైర్ రిటైనర్షిప్ సిస్టమ్ నుంచి A+ క్యాటగిరీని తొలగించాలని అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ బోర్డుకు సూచించినట్లు తెలిసిందని India Today పేర్కొంది. A+ ఆటగాళ్లకు ₹7 కోట్లు, A-₹5 కోట్లు, B-₹3 కోట్లు, C- ₹1 కోటిని BCCI చెల్లిస్తోంది.


