News March 25, 2025
సౌలభ్యాన్ని బట్టి త్వరలోనే బకాయిల విడుదల: సీఎం

AP: గత ప్రభుత్వం ఉద్యోగులకు రూ.20,637 కోట్ల అలవెన్సులను ఎగ్గొట్టిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇప్పటికే రూ.7,230 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. త్వరలోనే సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలను అకౌంట్లలో జమ చేస్తామని కలెక్టర్ల సదస్సులో హామీ ఇచ్చారు. ఉద్యోగులు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Similar News
News March 26, 2025
సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. ఇప్పుడెలా ఉందంటే?

రోడ్డు <<15881657>>ప్రమాదంలో<<>> గాయపడ్డ నటుడు సోనూసూద్ భార్య సోనాలీ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాగ్పూర్ మ్యాక్స్ ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. కోల్కతా నుంచి వచ్చిన సోనాలీని ఆమె సోదరి సునీత, మేనల్లుడు సిద్ధార్థ్ ఎయిర్పోర్టులో రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నా ఎయిర్బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది.
News March 26, 2025
యాడ్ ఫ్రీ ఇన్స్టా కోసం సబ్స్క్రిప్షన్.. ఎక్కడంటే?

యాడ్ ఫ్రీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కోసం సబ్స్క్రిప్షన్ను తేవాలని ‘మెటా’ యోచిస్తోంది. తాజాగా యూరప్లో ఈ విధానాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. యూరోపియన్ నియంత్రణ సంస్థలకు ‘మెటా’ తన ప్రతిపాదలను పంపింది. మొబైల్లో యాడ్ఫ్రీ ఇన్స్టా కోసం నెలకు $14(రూ.1200), డెస్క్టాప్లో FB& INSTA కోసం 17 డాలర్ల వరకు ఉండనుంది. అక్కడ అమలైతే అన్నిచోట్లా తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
News March 26, 2025
చేయని తప్పునకు 46 ఏళ్ల జైలు శిక్ష

జపాన్లో ఓ వ్యక్తి చేయని తప్పునకు 46 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇందుకు కోర్టు అతడికి ₹12కోట్ల నష్ట పరిహారమివ్వాలని పోలీసులను ఆదేశించింది. 1966లో ఇవావో హకమాడ అనే వ్యక్తి ఓ సోయాబీన్ ప్లాంట్లో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో ప్లాంట్ యజమాని, భార్యాపిల్లలు వారింట్లోనే కత్తిపోట్లకు గురై చనిపోయారు. ఆ నేరాన్ని అతడే చేశాడని పోలీసులు తప్పుడు సాక్ష్యాలతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా మరణశిక్ష విధించింది.