News December 5, 2024

మూగబోయిన ప్రసాద్స్ మల్టీప్లెక్స్! కారణమిదే..

image

రిలీజ్ షో అంటే హడావుడి ఉండే హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో పుష్ప2 విడుదలవలేదు. ఇందుకు థియేటర్ యాజమాన్యం-మైత్రి మూవీ మేకర్స్ మధ్య షేర్ వివాదం కారణం. గ్రాస్ కలెక్షన్లలో 55% డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేందుకు మిగతా ఎగ్జిబిటర్ చైన్స్ అంగీకరించాయి. కానీ ప్రసాద్స్ మాత్రం ఇప్పుడు ఇస్తే మున్ముందు మిగతా వారూ ఇదే డిమాండ్ చేస్తారని 52% మాత్రమే ఇస్తానని స్పష్టం చేసింది. ఫలితంగా ఇక్కడ పుష్ప2 సందడి లేదు.

Similar News

News October 21, 2025

ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

image

దీపావళి వేళ దేశంలో చాలా ప్రాంతాలను వాయు కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలోని నరైనా గ్రామంలో నిన్న రాత్రి 11.39pmకు వాయు నాణ్యత సూచీ(AQI) 1991గా నమోదైంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘హమారా ఢిల్లీ’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కాగా హైదరాబాద్‌లోనూ అర్ధరాత్రి AQI 150కిపైగా నమోదైంది. ఈ వాతావరణం అనారోగ్యానికి దారి తీస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

News October 21, 2025

తొలి వన్డేలో ఆ ప్లేయర్‌ను తీసుకోవాల్సింది: కైఫ్

image

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉండాల్సిందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. తుది జట్టులో అన్నీ కవర్ చేసినా వికెట్ టేకింగ్ బౌలర్‌ను తీసుకోలేదని చెప్పారు. AUS దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ అన్ని ఫార్మాట్లలో రాణించారని గుర్తు చేశారు. తొలి వన్డేలో ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కునెమన్ 2 వికెట్లు తీశారని తెలిపారు. క్వాంటిటీ కోసం క్వాలిటీ విషయం రాజీ పడ్డారన్నారు.

News October 21, 2025

అమెరికన్లకు ట్రంప్ దీపావళి విషెస్

image

ప్రపంచ దేశాధినేతలు సైతం హిందువులనుద్దేశించి దీపావళి విషెస్ చెబుతారు. అయితే US అధ్యక్షుడు ట్రంప్ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి అమెరికన్‌కు విషెస్ తెలియజేశారు. ఈ పండుగ కుటుంబాలను, స్నేహితులను, కమ్యూనిటీలను ఏకం చేసి నమ్మకాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అయితే హిందువులు, ఇండియన్స్‌ను విష్ చేయకుండా ట్రంప్ బుద్ధి చూపిస్తున్నాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.