News April 24, 2024
డూప్లకు ఫుల్ డిమాండ్

ఎన్నికల వేళ డూప్లకు డిమాండ్ ఏర్పడింది. వారితో ప్రచారం చేయించేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మోదీని పోలిన వికాస్, యోగీని పోలిన జగదీశ్, మరో మమతను తలపిస్తున్న రూమాల షెడ్యూల్ ప్రస్తుతం బిజీగా ఉండటం విశేషం. ప్రచారానికి రమ్మని అనేక మంది కోరుతున్నట్లు వారు చెబుతున్నారు. వీరేకాక సెలబ్రిటీలను పోలిన డూప్లను కూడా ప్రచారంలో దింపుతున్నారు. ఇటీవల షోలాపూర్లో కాంగ్రెస్ తరఫున షారుఖ్ డూప్ ప్రచారం చేశారు.
Similar News
News October 14, 2025
ఏమిటీ పరకామణి కేసు-రాజీ వ్యవహారం..?

తిరుమల <<17999947>>పరకామణి<<>>లో 2023లో ఉద్యోగి రవికుమార్ దొంగతనం చేయడంపై CID విచారణ జరగాలని స్థానిక జర్నలిస్టు శ్రీనివాసులు గతేడాది HCలో పిటిషన్ వేశారు. ఈ చోరీపై 2023 APRలో పోలీసులకు ఫిర్యాదు చేసిన TTD విజిలెన్స్ ఆఫీసర్ సతీష్, SEPలో లోక్ అదాలత్లో రవితో రాజీ చేసుకున్నారని తెలిపారు. దీంతో అదాలత్ నిర్ణయాన్ని సస్పెండ్ చేసిన జస్టిస్ రామకృష్ణ.. ఖజానా రికార్డులు, రాజీ ఉత్తర్వుల సీజ్కు CIDని ఆదేశించినా ఆ పని చేయలేదు.
News October 14, 2025
ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ నాటి MD హరిరామ్ ఆస్తుల జప్తుకు ఇరిగేషన్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. మర్కూక్లో 28, బొమ్మలరామారంలో 6ఎకరాలు, పటాన్చెరులో 20గుంటలు, షేక్పేట, కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగిలో 2 ఇళ్లు, ఫ్లాట్లు, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ప్లాట్లు, అమరావతిలో స్థలం, కొత్తగూడెంలో బిల్డింగ్ను జప్తు చేయనున్నారు.
News October 14, 2025
పోలీస్ శాఖను మూసేయడం బెటర్: హైకోర్టు అసంతృప్తి

ఏపీలో డీజీపీ, పోలీస్ శాఖ నిద్రావస్థలో ఉన్నాయని హైకోర్టు మండిపడింది. డిపార్టుమెంటును మూసేయడం మంచిదని అసంతృప్తి వ్యక్తం చేసింది. TTD పరకామణి విషయంలో లోక్ అదాలత్లో రాజీ రికార్డుల సీజ్కు HC SEP 19న ఆదేశాలిచ్చింది. CIDలో సీజ్ అధికారం గల IG పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పని చేయలేదన్న పోలీస్ శాఖను తప్పుబట్టింది. సదుద్దేశం ఉంటే తమకు ఆ విషయం చెప్పేవారని లేదా మరో IG స్థాయి అధికారితో ఆ పని చేయించేవారంది.