News October 4, 2024

గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

image

AP: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై రెండవ రోజు గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దుర్గమ్మ దర్శనార్థం భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి రోజు బాలాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.

Similar News

News December 1, 2025

నారాయణపేట జిల్లాలో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు

image

నారాయణపేట జిల్లాలో హెచ్‌ఐవీ-ఎయిడ్స్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 4,557 కేసులు నమోదు కాగా, 1,418 మంది మరణించారు. ప్రస్తుతం 1,822 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులు విస్తరిస్తుండటంతో, అధికారులు అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.

News December 1, 2025

పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్ను!

image

పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్నులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు-2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక పొగాకు, పొగాకు ప్రొడక్టులపై జీఎస్టీతోపాటు ఎక్సైజ్ లెవీని విధిస్తారని తెలుస్తోంది. పాన్ మసాలా తయారీపై జీఎస్టీతోపాటు కొత్త సెస్‌ విధించనున్నట్లు సమాచారం.

News December 1, 2025

ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

image

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.