News April 27, 2024
దుర్గమ్మ ఆశీస్సులు ఎవరికో!

ప్రముఖ పుణ్యక్షేత్రం దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. ఇది బంగారం, హోల్సేల్ వ్యాపారాలతో వాణిజ్యానికి ప్రధాన కేంద్రం. కాంగ్రెస్ 6, CPI 5 సార్లు, YCP 2 సార్లు, TDP ఒకసారి గెలిచింది. ఇక్కడ ఒకసారి గెలిచిన వ్యక్తి వరుసగా మరోసారి గెలవలేదు. కాగా హ్యాట్రిక్పై గురి పెట్టిన YCP ఈసారి షేక్ ఆసిఫ్ను బరిలోకి దింపింది. BJP తరఫున పారిశ్రామిక వేత్త సుజనా చౌదరి బరిలో నిలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 16, 2026
ఇరాన్ వీధుల్లో అద్దె సైనికులు

ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలను అణిచివేయడానికి ఖమేనీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ భద్రతా బలగాలపై నమ్మకం తగ్గడంతో ఇరాక్ నుంచి కిరాయికి యువకులను రప్పించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యాత్రికుల ముసుగులో వీరంతా ఇరాన్లోకి చొరబడుతున్నారని, అనంతరం నిరసనకారులపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హెజ్బొల్లా గ్రూప్ వంటి వారు ఇందులో ఉన్నట్లు సమాచారం.
News January 16, 2026
NTPCలో ఉద్యోగాలు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 16, 2026
కనుమ రోజు మినుము ఎందుకు తినాలి?

కనుమ పశువులకు, పితృదేవతలకు అంకితం చేసిన పండుగ. ఈరోజు చనిపోయిన పెద్దల కోసం పెట్టే ప్రసాదాల్లో గారెలు ప్రధానమైనవి. వీటిలో పోషకాల విలువలు ఎక్కువ. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, బలాన్ని అందించడంలో మినుములు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ‘కనుమ రోజు మినుము తినాలి’ అనే సామెత పుట్టింది. ఆ రోజు అల్లుళ్లు, బంధువులతో కలిసి మినుములతో చేసిన వంటకాలు తింటూ, విశ్రాంతిగా గడపడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు రహస్యం.


