News September 20, 2024

సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా: సీఎం రేవంత్

image

TG: దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే లాభాల్లో కూడా వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘మొత్తం 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ఇస్తున్నాం. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించాం. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం. కార్మికులు, ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

వికారాబాద్‌లో టెట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి- స్పీకర్

image

జనవరి 3 నుంచి 31, 2026 వరకు జరిగే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)-2026 అభ్యర్థుల సౌకర్యార్థం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేకంగా లేఖ రాశారు.

News November 20, 2025

ఎగుమతులకు రష్యా చమురు కొనుగోలు చేయం: రిలయన్స్

image

రష్యా నుంచి కొనుగోలు చేయని చమురును మాత్రమే శుద్ధి చేసి ఎగుమతి చేస్తామని రిలయన్స్ వెల్లడించింది. ఎగుమతులకు ఉపయోగించే చమురు కొనుగోళ్లను నేటి నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి రష్యా నుంచి కొనుగోలు చేయని చమురును మాత్రమే శుద్ధి చేసి ఎగుమతి చేయనున్నట్టు తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని రిలయన్స్ ప్రతినిధి తెలిపారు.

News November 20, 2025

జగన్ జైలుకెళ్లడం ఖాయం: మంత్రి సత్యకుమార్

image

AP: పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ కోర్టులను మభ్యపెట్టలేరని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘విచారణలో భాగంగా కోర్టులకు హాజరయ్యేవారు వినయంగా వ్యవహరిస్తారు. తాను కోర్టుకు హాజరైతే సమస్యలు ఎదురవుతాయని కోర్టును నమ్మబలికే ప్రయత్నంలో భాగంగానే HYDలో నానా హంగామా చేశారు. జగన్‌లో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకు వెళ్లడం ఖాయం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.