News September 20, 2024

సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా: సీఎం రేవంత్

image

TG: దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే లాభాల్లో కూడా వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘మొత్తం 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ఇస్తున్నాం. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించాం. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం. కార్మికులు, ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 7, 2025

హెయిర్ డై వేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఒక్క తెల్లవెంట్రుక కనబడగానే కంగారు పడిపోయి జుట్టుకు రంగులువేస్తుంటారు చాలామంది. అయితే హెయిర్ డై వేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇన్‌స్టాంట్ కలర్ ఇచ్చే బ్లాక్ హెన్నా, షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. సల్ఫేట్లు, అమోనియా పెరాక్సైడ్, PPD లేనివి ఎంచుకోవాలి. తలస్నానం చేసి కండిషనర్ రాశాకే రంగు వేయాలి. ముఖానికి, మాడుకు మాయిశ్చరైజర్ రాసి, తర్వాత డై వేసుకోవాలని సూచిస్తున్నారు.

News November 7, 2025

కోహ్లీ, బాబర్‌కు తేడా అదే: పాక్ క్రికెటర్

image

పాకిస్థాన్ క్రికెట్‌పై బాబర్ ఆజమ్ ఎంతో ప్రభావం చూపారని ఆ దేశ క్రికెటర్ ఆజం ఖాన్ అన్నారు. ‘బౌలింగ్‌కు పేరుగాంచిన పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌ విషయంలో బాబర్ ఫేమస్ చేశారు. అచ్చం ఇండియా కోసం కోహ్లీ చేసినట్లే. అయితే కోహ్లీ కెరీర్ ప్రారంభంలో సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, సెహ్వాగ్, ధోనీ వంటి లెజెండ్స్ ఉన్నారు. కానీ బాబర్‌కు ఎవరున్నారు? అతడు ఎంతో భారం మోయాల్సి వచ్చింది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

News November 7, 2025

ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు

image

<>ఏపీ గ్రామీణ బ్యాంకు<<>>లో 7 ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 35 నుంచి 63ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు జీతం రూ.23,500, సీనియర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్‌కు రూ.30వేల జీతం చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: apgb.bank.in