News August 28, 2024
ఇంద్రకీలాద్రిపై OCT 3 నుంచి దసరా మహోత్సవాలు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై OCT 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. 3న బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 4న గాయత్రీదేవి, 5న అన్నపూర్ణ, 6న లలితా త్రిపుర సుందరీదేవి, 7న మహాచండీ, 8న మహాలక్ష్మీ దేవి, 9న సరస్వతి, 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్దిని, 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు EO రామారావు తెలిపారు.
Similar News
News November 25, 2025
మణుగూరు: ‘కలెక్టర్ గారూ.. జర ఇటు చూడండి’

మణుగూరులోని చినరావిగూడెంలో ఇసుక ర్యాంపుల కోసం అడవిలోని చెట్లను కొందరు నరికేశారని, ఇసుక అక్రమ రవాణా కోసం తాత్కాలికంగా రోడ్లను నిర్మించుకుంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. చట్టాలు ఏమయ్యాయని, పోడు రైతులకు ఒక న్యాయం, అక్రమార్కులకు ఒక న్యాయమా అని వారు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా చెట్లని తొలగిస్తున్నా జిల్లా కలెక్టర్ స్పందించరా అని అడుగుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News November 25, 2025
మణుగూరు: ‘కలెక్టర్ గారూ.. జర ఇటు చూడండి’

మణుగూరులోని చినరావిగూడెంలో ఇసుక ర్యాంపుల కోసం అడవిలోని చెట్లను కొందరు నరికేశారని, ఇసుక అక్రమ రవాణా కోసం తాత్కాలికంగా రోడ్లను నిర్మించుకుంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. చట్టాలు ఏమయ్యాయని, పోడు రైతులకు ఒక న్యాయం, అక్రమార్కులకు ఒక న్యాయమా అని వారు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా చెట్లని తొలగిస్తున్నా జిల్లా కలెక్టర్ స్పందించరా అని అడుగుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News November 25, 2025
ప్రశాంతతను ప్రసాదించే విష్ణు నామం..

అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ||
అమృతాన్ని ఇచ్చే చంద్రుడి నుంచి ఉద్భవించిన, దేవకీ నందనుడు అయిన కృష్ణుడి శక్తి కలిగిన, త్రిసామ అనే వేదాల సారం కలగలసిన పవిత్ర శ్లోకమిది. విష్ణు సహస్ర నామాల్లో ఒకటైన ఈ మంత్రాన్ని పఠిస్తే జ్ఞానం లభిస్తుందని నమ్మకం. మనకు తెలియకుండానే అంతర్గత శక్తి పెరిగి మనశ్శాంతి దొరుకుతుందని చెబుతారు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


