News October 11, 2024
ప్రయాణికులకు ‘దసరా’ షాక్

AP: దసరాకు నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ దోచేస్తున్నాయి. ఇవాళ నాన్ AC బస్సుల్లో అదనంగా ₹700-1,000, AC బస్సుల్లో ₹1,000-2,000 వరకు గుంజుతున్నాయి. ఆదివారం తిరుగు ప్రయాణానికి రెండింతల రేట్లు పెంచేశాయి. ఉదా. HYD నుంచి కడపకు టికెట్ ధర ₹1,000 ఉండగా, ఇప్పుడు ₹2,000-3,000 లాగుతున్నాయి. ప్రత్యక్షంగానే దోపిడీ కనపడుతున్నా రవాణా శాఖ పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి.
Similar News
News December 5, 2025
TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

TG: ఇన్సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.
News December 5, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <
News December 5, 2025
13న ప్రతి జిల్లాలో 10వేల మందితో ర్యాలీ: సజ్జల

AP: GOVT మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు అద్భుత స్పందన వస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈనెల 10న నియోజకవర్గ, 13న జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహించి 16న గవర్నర్ను కలుస్తామన్నారు. ‘అన్ని విభాగాలు ప్రతిష్ఠాత్మకంగా పనిచేయాలి. జిల్లాలో 10వేల మందికి పైగా క్యాడర్తో ర్యాలీలు జరగాలి. ఎక్కడ చూసినా కోటి సంతకాల కార్యక్రమ హడావిడే ఉండాలి’ అని సూచించారు.


