News October 5, 2025
దసరా స్పెషల్.. ఆర్టీసీకి ₹110 కోట్ల ఆదాయం

దసరా నేపథ్యంలో ₹110 కోట్ల ఆదాయం సమకూరినట్లు TGSRTC తెలిపింది. 7,754 స్పెషల్ బస్సులు తిప్పాలని నిర్ణయించినా ప్రయాణికులు లేకపోవడంతో 5,300 బస్సులే నడిపినట్లు వెల్లడించింది. గతేడాది 6,300 ప్రత్యేక బస్సులు వేయగా ₹114 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది. ఈసారి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గడం, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతో ఆదాయం తగ్గినట్లు వివరించింది. కాగా ఇవాళ, రేపు బస్సుల్లో రద్దీ పెరిగే ఛాన్స్ ఉంది.
Similar News
News March 13, 2026
CECపై అవిశ్వాసం.. రేపు నోటీసులు?

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రేపు పార్లమెంటులోని ఏదో ఒక సభలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రెండు సెట్ల నోటీసులపై 193 మంది(130 లోక్సభ, 63 రాజ్యసభ) ఎంపీలు సంతకం చేసినట్లు సమాచారం. CECపై 7 ఆరోపణలు చేసినట్లు ప్రతిపక్ష వర్గాలు చెప్పాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించాలని కోరుతూ నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి కానుంది.
News March 13, 2026
కోమాలో మొజ్తబా ఖమేనీ: UK మీడియా

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారని UK మీడియా చెబుతోంది. ఆయన ఒక కాలు కోల్పోయారని, పొట్ట/లివర్కు తీవ్రంగా గాయాలయ్యాయని అంటోంది. అయితే <<19348883>>అలీ ఖమేనీ<<>> చనిపోయిన రోజే గాయపడ్డారా, లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ వార్తలు వచ్చిన కాసేపటికే <<19365703>>మొజ్తబా హెచ్చరించారంటూ<<>> ఇరాన్ ప్రభుత్వ TV ప్రకటన చేసింది. దీంతో ‘కోమాలో ఉన్నప్పటికీ USకు మొజ్తబా వార్నింగ్ ఇచ్చారు’ అని బ్రిటన్ మీడియా సెటైర్స్ వేసింది.
News March 12, 2026
ఫోన్ పే, గూగుల్ పేలో కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారా?

ఆన్లైన్ పేమెంట్స్ ప్లాట్ఫామ్స్ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిలో కరెంట్ బిల్లుల చెల్లింపు ఆప్షన్ పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో లాగా బిల్ జనరేట్ అవ్వడం లేదని, తాత్కాలికంగా బిల్లర్ డౌన్ అంటూ చూపుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? అయితే విద్యుత్ శాఖ అఫీషియల్ యాప్లో పవర్ బిల్ పే చేయొచ్చు.


