News October 13, 2024
డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణం
AP: డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో రూ.50 వేల రాయితీ కూడా ఇవ్వనుంది. రాయితీ పోనూ మిగతా రుణంపై వడ్డీ ఉండదు. వ్యాపారం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, తయారీ, సేవా రంగంలో ఉన్నవారికి ఈ రాయితీ రుణాలు ఇవ్వనుంది. తీసుకున్న మొత్తాన్ని 24 నుంచి 60 నెలల్లో వాయిదా పద్ధతుల్లో తీర్చాల్సి ఉంటుంది. రాయితీని చివర్లో మినహాయిస్తారు.
Similar News
News October 13, 2024
ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు.. విశేషాలు
తిరుమల బ్రహ్మోత్సవాలు నిన్నటితో విజయవంతంగా ముగిశాయి. మొత్తం 8 రోజుల్లో శ్రీనివాసుడిని 6 లక్షల మంది దర్శించుకున్నారని, 15 లక్షల మంది శ్రీవారి వాహనసేవలు వీక్షించినట్లు TTD అధికారులు తెలిపారు. ఒక్క గరుడసేవలోనే సుమారు 3.5 లక్షల మంది పాల్గొన్నారు. రూ.26 కోట్ల హుండీ ఆదాయం రాగా మొత్తం 30 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.60 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 8 రోజుల్లో 26 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.
News October 13, 2024
చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా
బంగ్లాదేశ్తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో అత్యధిక సిరీస్లు క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 34 సిరీస్లు ఆడి 10 సిరీస్ల్లో ప్రత్యర్థిని వైట్ వాష్ చేసింది. టీమ్ ఇండియా తర్వాత పాకిస్థాన్ (8), అఫ్గానిస్థాన్ (6), ఆస్ట్రేలియా (5), ఇంగ్లండ్ (4) ఉన్నాయి.
News October 13, 2024
WC.. ఇవాళ భారత్ VS ఆసీస్
మహిళల టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. గ్రూప్ ఏ నుంచి ఆసీస్ ఇప్పటికే సెమీస్ చేరగా.. మరో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. షార్జా వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ALL THE BEST INDIA