News June 25, 2024

రాజధాని కోసం డ్వాక్రా మహిళల రూ.4.50 కోట్ల విరాళం

image

AP: అమరావతి నిర్మాణం కోసం చిత్తూరు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు రూ.4.5 కోట్ల భారీ విరాళాన్ని సేకరించారు. ఆ చెక్కును సీఎం చంద్రబాబుకు ఈరోజు అందజేశారు. పాతికేళ్ల క్రితం డ్వాక్రా మహిళల కోసం చంద్రబాబు వేసిన విత్తనమే నేడు మహావృ‌క్షమై లక్షలాది కుటుంబాలను ఆదుకుంటోందని ఈ సందర్భంగా కొనియాడారు. ఆ విశ్వాసంతోనే అమరావతి నిర్మాణం కోసం ఉడతాభక్తిగా విరాళాన్ని కలెక్ట్ చేసి అందజేశామని వారు వెల్లడించారు.

Similar News

News October 10, 2024

Ratan Tata: చాలామంది స్టార్టప్ ఓనర్లకు మెంటార్ కూడా..

image

రతన్ టాటా ఇండస్ట్రియలిస్ట్, ఇన్వెస్టర్ మాత్రమే కాదు. ఎందరో యంగ్ ఆంత్రప్రెన్యూర్స్‌కు ఆయన మెంటార్. 2014లో తొలిసారి స్నాప్‌డీల్‌లో పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత Ola, Upstox, Lenskart, CarDekho, FirstCry, Paytm, Bluestone వంటి 50+ న్యూఏజ్ స్టార్టప్పుల్లో ఇన్వెస్ట్ చేశారు. వ్యాపారంలో రాణించేందుకు ఆ ఓనర్లకు బిజినెస్ పాఠాలు చెప్పారు. డిసిషన్ మేకింగ్, స్ట్రాటజీస్ రూపకల్పనపై తన అనుభవాన్ని పంచుకున్నారు.

News October 10, 2024

నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: సీఎం

image

AP: YCP హయాంలో అందరికంటే ఎక్కువ వేధింపులకు గురైంది తానేనని CM చంద్రబాబు అన్నారు. ‘నేను జైలులో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు కుట్ర పన్నారనే ప్రచారం జరిగింది. జైలుపై డ్రోన్లు ఎగురవేశారు. CC కెమెరాలు పెట్టారు. దోమ తెర కూడా ఇవ్వలేదు. కక్ష తీర్చుకోవడం నా లక్ష్యం కాదు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మరీ మితిమీరితే ఏం చేయాలో నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

News October 10, 2024

ఆయూష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AP: బీఏఎంఎస్, BHMS, BUMS కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ-2024లో అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు వర్సిటీ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంది. ఇటు MBBS మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు ఈ నెల 14తేదీ లోపు ఫ్రీఎగ్జిట్ అవ్వొచ్చని తెలిపింది. దివ్యాంగ కోటాలో కన్వీనర్ సీట్లు పొందిన వారు ఈ నెల 11లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలంది.