News February 22, 2025

Dy.cm పవన్ కుంభమేళా ఫొటోలతో పోస్ట్‌లు.. కేసు నమోదు

image

Dy.cm పవన్ కళ్యాణ్‌, ఆయన కుంటుంబ సభ్యులు ఇటీవల ప్రయాగరాజ్‌లోని మహాకుంభ మేళాలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్, ఆయన కుంటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ కుంభమేళా ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తుల పేర్లతో ఉన్న నాలుగు Xఎకౌంట్‌లలో పోస్ట్ చేసి తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News September 17, 2025

AICTE ప్రగతి స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్

image

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<> AICTE<<>> , కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన తర్వాత ఏడాదికి రూ.50వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్లు ఆర్థిక సాయం చేస్తారు.

News September 17, 2025

జగిత్యాల : హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

image

పొలాస-గుల్లపేట గ్రామాల సమీపంలో జరిగిన ఆటో డ్రైవర్ నహిముద్దీన్ హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. బీహార్ కు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్నిలు అద్దెకు ఆటో మాట్లాడుకుని వెళ్లారు. అద్దె విషయంలో గొడవ జరిగి గుడ్డతో ఉరివేసి తరువాత బండతో మోది హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

News September 17, 2025

JAM-2026కు దరఖాస్తు చేశారా?

image

<>JAM<<>>-2026కు దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 12 ఆఖరు తేదీ. ఐఐటీల్లో బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌ విభాగంలో పీజీలో ప్రవేశం పొందవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.2000(రెండు పేపర్లకు రూ.2700), మహిళలు, SC, ST, దివ్యాంగులు రూ.1000 (రెండు పేపర్లకు రూ.1,350) చెల్లించాలి.