News March 23, 2025
Dy.CM పవన్ కళ్యాణ్ని సన్మానించిన బుడగ జంగాలు

కర్నూలు జిల్లా పూడిచెర్లకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ సన్మానించారు. క్యాబినెట్, అసెంబ్లీలో బుడగ జంగలకు ఎస్సీ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపిన కూటమి నాయకులకు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, MP బైరెడ్డి శబరికు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 25, 2025
బెట్టింగ్ జోలికెళ్లొద్దు: కర్నూలు SP

ఐపీఎల్ వేళ యువత బెట్టింగ్కు దూరంగా ఉండాలని కర్నూలు SP విక్రాంత్ పాటిల్ సూచించారు. ‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమనే మాయలో పడకండి. అమాయక ప్రజలను మోసగించేందుకు ముఠాలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్తో కొందరు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే 100/112కు సమాచారం ఇవ్వండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం’ అని ఎస్పీ తెలిపారు.
News March 25, 2025
ప్యాపిలి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఎస్.రంగాపురం గ్రామానికి చెందిన ఐఐటీ స్టూడెంట్ అరుణ్ కుమార్ పంజాబ్లో ఈ నెల 15న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోలుకోలేక నిన్న మృతి చెందాడు. సోమవారం రాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. పంజాబ్లో ఐఐటీ చదువుతున్న అరుణ్ క్యాంపస్ సెలక్షన్లో ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది.
News March 25, 2025
జియో మైసూర్ కంపెనీ గోల్డ్ మెన్స్ సౌత్ ఆఫ్రికా టీమ్స్ సర్వే

తుగ్గలి మండలం జొన్నగిరి పరిసర ప్రాంతాలలో జియో మైసూర్ కంపెనీ నిర్వహిస్తున్న గోల్డ్ మైన్స్ను సౌత్ ఆఫ్రికా మైనింగ్ నిపుణులు సోమవారం సర్వే చేసినట్లు పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి క్రాంతి నాయుడు తెలిపారు. సీఎస్ఆర్ పనులు, పర్యావరణ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, ల్యాండ్ లీజ్, స్కిల్ డెవలప్మెంట్ గురించి మైనింగ్ నిపుణులు చర్చించారని ఆయన తెలిపారు.