News October 9, 2024

దుర్గమ్మ చెంత కూతురు ఆద్యతో DyCM పవన్ (PHOTOS)

image

విజయవాడలోని కనక దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్య కొణిదెలతో ఆలయానికి చేరుకొని సరస్వతి దేవిగా దర్శనమిస్తోన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి ఇద్దరికీ పట్టు వస్త్రాలు సమర్పించారు. హోమ్ మంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

Similar News

News March 7, 2025

నేడు మంత్రివర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని బ్లాక్-1లో ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

News March 7, 2025

గాజా నుంచి పారిపోండి: హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం

image

బందీలను విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌ను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా హమాస్‌పై ట్రంప్ ధ్వజమెత్తారు. ‘మరణించినవారి మృతదేహాలను తక్షణమే అప్పగించండి. బందీలను విడుదల చేయండి. లేదంటే నరకం అనుభవిస్తారు. మిమ్మల్ని చంపడానికి ఇజ్రాయెల్‌కు అవసరమైనవన్నీ ఇస్తా. ఒక్క హమాస్ సభ్యుడు కూడా ప్రాణాలతో ఉండడు. తెలివైన నిర్ణయం తీసుకోండి’ అని ఫైర్ అయ్యారు.

News March 7, 2025

జియో హాట్‌స్టార్ విలీనం ఎఫెక్ట్..1,100 మందిపై వేటు

image

జియో హాట్‌స్టార్ సంస్థ 1,100 మంది ఉద్యోగులపై వేటు వేసింది. జూన్‌లోగా వీరందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్, కమర్షియల్, లీగల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగులను ఎక్కువగా తొలగించింది. వీరందరికి 6 నుంచి 12 నెలల జీతం ఇచ్చి వదిలించుకోనుంది. కాగా విలీనం తర్వాత జియో హాట్‌స్టార్ విలువ రూ.70,352 కోట్లుగా ఉంటుందని అంచనా.

error: Content is protected !!