News August 28, 2024

నేడు ఇ-క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్!

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఇ-క్యాబినెట్ భేటీ జరగనుంది. ఇకపై ప్రతి మంత్రివర్గ సమావేశం ఇలాగే నిర్వహిస్తారు. ఎజెండా, నోట్స్.. ఇలా అన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఇవాళ్టి భేటీలో రివర్స్ టెండరింగ్ రద్దు చేసి పాత టెండర్ల విధానం, సాగునీటి సంఘాలకు ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ఎడమ కాలువకు టెండర్లు తదితర అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.

Similar News

News September 16, 2025

BREAKING: మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్‌లో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనకు సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. కాగా మధుయాష్కీకి ప్రమాదమేమీ లేదని, బీపీ పెరిగి కళ్లు తిరిగి కిందపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

News September 16, 2025

కిచెన్ గార్డెనింగ్ ఇలా చేసేద్దాం..

image

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. కిచెన్ ప్లాంట్స్‌కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్‌లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. అప్పుడే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టమాటా, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. వీటికి సరిపడా నీరు పోయాలి. కుండీల కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.

News September 16, 2025

దసరా సెలవులు ఎప్పుడంటే?

image

AP: స్కూళ్లకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మైనారిటీ పాఠశాలలకు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నాయి. జూనియర్ కాలేజీలకు SEP 28 నుంచి OCT 5 వరకు హాలిడేస్ ఉంటాయి. అటు తెలంగాణలో స్కూళ్లకు ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.