News August 28, 2024
నేడు ఇ-క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్!

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఇ-క్యాబినెట్ భేటీ జరగనుంది. ఇకపై ప్రతి మంత్రివర్గ సమావేశం ఇలాగే నిర్వహిస్తారు. ఎజెండా, నోట్స్.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. ఇవాళ్టి భేటీలో రివర్స్ టెండరింగ్ రద్దు చేసి పాత టెండర్ల విధానం, సాగునీటి సంఘాలకు ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ఎడమ కాలువకు టెండర్లు తదితర అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.
Similar News
News November 20, 2025
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు: సజ్జనార్

TG: పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఉద్యోగులను బెదిరించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుందని ప్రకటన జారీ చేశారు.
News November 20, 2025
BSNL.. రూ.2,399కే ఏడాదంతా..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే ఏడాది రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్నట్లు పేర్కొంది. రూ.2,399తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు రోజుకు 2GB డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేసింది. కాగా జియో, ఎయిర్టెల్ ఏడాది ప్లాన్స్ రూ.3,500కు పైగానే ఉన్నాయి. అయితే BSNL నెట్వర్క్ మెరుగుపడాలని, అది సరిగా లేకుంటే ఎన్ని ఆఫర్లు ఇచ్చినా లాభం లేదని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.
News November 20, 2025
KTRను ప్రాసిక్యూట్ చేసేందుకు పర్మిషన్.. వివరాలు ఇవే!

TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు ACB గతంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ 4 సార్లు ACB విచారణకు హాజరయ్యారు. డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ రికార్డులు కలెక్ట్ చేసింది. దీనిపై KTRను ప్రాసిక్యూట్ చేసేందుకు సెప్టెంబర్లో ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరగా ఇప్పుడు <<18337628>>పర్మిషన్<<>> ఇచ్చారు.


