News November 7, 2025
e-KYC పూర్తి చేయకపోతే రేషన్ కార్డులు రద్దు!

AP: e-KYC పూర్తి చేయించుకోని వారి రేషన్ కార్డులను రద్దుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ e-KYC చేయించుకోవాలని, లేదంటే అనర్హులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల్లోని సభ్యుల్లో చాలా మంది ఇంకా e-KYC చేయించుకోలేదని, డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రంలో వేలిముద్ర ఇస్తే e-KYC పూర్తయినట్లేనని అధికారులు తెలిపారు.
Similar News
News February 22, 2026
కర్ణాటకలో పవర్ షేరింగ్పై త్వరలో కీలక ప్రకటన!

కర్ణాటకలో CM సిద్దరామయ్య, Dy.CM DK శివకుమార్ మధ్య సాగుతున్న అధికార పోరుకు కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో ముగింపు పలకనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి సతీశ్ జార్కీహోళీ తెలిపారు. పవర్ షేరింగ్పై హైకమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు AICC అధ్యక్షుడు ఖర్గేను కలిసిన అనంతరం ఆయన వెల్లడించారు. సిద్దరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో అధికారాన్ని తనకు అప్పగించాలని శివకుమార్ కోరుతున్న విషయం తెలిసిందే.
News February 22, 2026
చిక్కిపోతున్న చందమామ!

చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నాడని నేషనల్ ఎయిర్&స్పేస్ మ్యూజియానికి చెందిన సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ ప్లానెటరీ స్టడీస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రకంపాల వల్ల ఏర్పడే పగుళ్లే ఇందుకు కారణమని చెబుతున్నారు. చందమామపై పగుళ్ల గురించి శాస్త్రవేత్తలకు 2010 నుంచే తెలిసినా తాజాగా లూనార్ మారియా ప్రాంతాల్లో 1,114 కొత్త పగుళ్లను గుర్తించారు. వీటిని స్మాల్ మేర్ రిడ్జెస్ అని పిలుస్తున్నారు.
News February 22, 2026
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<


