News August 23, 2024

ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలి: పవన్

image

AP: గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ‘ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించం. అవసరమైతే గూండా యాక్ట్ తీసుకొస్తాం. గ్రామాల్లో కాలేజీలు, క్రీడా మైదానాలు లేవు. ప్రభుత్వ స్థలాలుంటే నిర్మాణాలు చేసుకోవచ్చు. దాతలు ముందుకొస్తే నేను కూడా నిధులు తీసుకొస్తా. క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తా ‘ అని పేర్కొన్నారు.

Similar News

News October 28, 2025

ఇంట్లో కాలుష్యానికి వీటితో చెక్

image

ప్రస్తుతకాలంలో కాలుష్యం లేని స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఆరుబయటే కాదు ఇంట్లో కూడా కాలుష్యం విస్తరిస్తోంది. దీన్ని తగ్గించాలంటే ఇంట్లో కొన్నిమొక్కలు పెంచాలంటున్నారు నిపుణులు. బోస్ట‌న్ ఫెర్న్‌, స్పైడ‌ర్ ప్లాంట్‌, వీపింగ్ ఫిగ్‌, పీస్ లిల్లీ, ఇంగ్లిష్ ఐవీ మొక్క‌లు గాలిని శుభ్రం చేయడంలో స‌హాయం చేస్తాయి. గాలి కాలుష్యాన్ని తొల‌గించి మ‌నకు స్వ‌చ్ఛ‌మైన గాలిని అందిస్తాయంటున్నారు.

News October 28, 2025

శివుడి కోసం సతీదేవి ఏం చేసిందంటే..?

image

సతీదేవికి శివునిపై ఉన్న ప్రేమను, భర్త గౌరవం పట్ల ఆమెకున్న నిబద్ధతను దక్షయజ్ఞ ఘట్టం మనకు నిరూపిస్తుంది. శివుడిని దక్షుడు అవమానించడం ఆమె సహించలేకపోయింది. శివుని ఔదార్యాన్ని వివరించి, దక్షుడి అహంకారాన్ని ఖండించింది. శివునిపై ద్వేషం పెంచుకున్న తండ్రి నుంచి వచ్చిన ఈ శరీరం శివుని అవమానంతో కలుషితమైందని భావించింది. అందుకే, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి యోగాగ్ని ద్వారా దేహత్యాగం చేసింది. <<-se>>#Shakthipeetham<<>>

News October 28, 2025

మచిలీపట్నానికి 70kmల దూరంలో తుఫాన్

image

AP: బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ గంటకు 15km వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 70 km, కాకినాడకు 150 km, విశాఖపట్నానికి 250 km దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 90-110కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు.