News June 11, 2024

EAPCET RESULTS.. టాప్ ర్యాంక్ ఎవరికంటే?

image

AP EAPCET ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో గుంటూరుకు చెందిన మాకినేని జిష్ణుసాయి తొలి ర్యాంక్ సాధించారు. కర్నూలుకు చెందిన మురసాని యశ్వంత్ రెడ్డి 2వ ర్యాంక్, ఆదోనికి చెందిన బోగాలపల్లి సందేశ్ 3, అనంతపురానికి చెందిన సతీశ్ రెడ్డి 4, గుంటూరుకు చెందిన కోమటినేని మనీశ్ 5వ ర్యాంక్ సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది, అగ్రికల్చర్ విభాగంలో 70,352 మంది అర్హత సాధించారు.

Similar News

News September 11, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గరియాబాద్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం. అటు మావోల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.

News September 11, 2025

కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

image

TG: BRS అధినేత KCR స్వగ్రామమైన సిద్దిపేట(D) చింతమడక గ్రామస్థులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కలిశారు. HYD బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి వచ్చి ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని ఆహ్వానించారు. ‘గొప్ప ఉద్యమకారుడిని కన్న ఊరు మా చింతమడక. పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను బతుకమ్మకు ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ఈ సమయంలో మీరంతా వచ్చి నాకు ఇచ్చింది మామూలు ధైర్యం కాదు’ అని కవిత అన్నారు.

News September 11, 2025

నా కుమారుడు YSR వారసుడే: షర్మిల

image

AP: YCP, జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘నా బిడ్డ రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే YCP ఇంతలా రియాక్ట్ అవుతోందంటే భయమా? నా కుమారుడికి రాజారెడ్డి అనే పేరు YSR పెట్టారు. ఎవరెన్ని వాగినా నా కొడుకు ఆయన వారసుడే. జగన్‌కు అసలు ఐడియాలజీ ఉందా? YSR బతికి ఉండి ఉంటే మీరు చేసిన పనికి తలదించుకునేవారు. జగన్ చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.