News May 24, 2024
ఈఏపీసెట్.. నేడు బీటెక్ స్ట్రీమ్ ‘కీ’ విడుదల

APEAPCET పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇంజినీరింగ్ విభాగంలో 2,74,213 మందికి గాను 2,58,373 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 88,638 మందికి గాను 80,766 మంది పరీక్ష రాసినట్లు సెట్ ఛైర్మన్ తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ విడుదల చేయగా.. 25వ తేదీ ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇంజినీరింగ్ విభాగం కీ ఇవాళ రిలీజ్ చేస్తారు. 26 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
Similar News
News January 1, 2026
కొత్త ఏడాదిలో మీ రెజల్యూషన్స్ ఏంటి?

కొత్త ఏడాదిలోకి గ్రాండ్గా అడుగు పెట్టేశాం. ఈ శుభ సందర్భంలో చాలా మంది రెజల్యూషన్స్ తీసుకుంటారు. ఉద్యోగం సాధించాలని, పొదుపు చేయాలని, మందు/ సిగరెట్ మానేయాలని, డైట్ ఫాలో కావాలని, జిమ్కు వెళ్లాలని, కొత్త ప్రదేశాలు చుట్టిరావాలని ఇలా తమకు నచ్చిన తీర్మానాలు చేసుకుంటారు. మీ రెజల్యూషన్స్ ఏంటి? గతేడాది పెట్టుకున్న గోల్స్ను పూర్తి చేశారా? కామెంట్ చేయండి.
News January 1, 2026
పాలు పితికేటప్పుడు ఈ తప్పు చేయొద్దు

కొందరు పాడి రైతులు పశువు నుంచి పాలను సేకరించేటప్పుడు పొదుగు నుంచి పూర్తిగా పాలను తీయకుండా కొన్నింటిని వదిలేస్తారు. ఇలా పొదుగులో మిగిలిపోయిన పాలలోకి బాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధికి కారణమవుతుందని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అలాగే పొదుగుకు అయ్యే చిన్న గాయాలకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పొదుగులోకి వ్యాపించి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
News January 1, 2026
హరిహరులను కొలిచేందుకు నేడే సరైన సమయం

నేడు హరిహరులను కలిపి పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘గురువారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం. అలాగే ఈరోజు త్రయోదశి తిథి. ప్రదోష వ్రతం కూడా నిర్వహిస్తారు. శివారాధనకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఒకే రోజున అటు హరి, ఇటు హర.. ఇద్దరినీ పూజించే అరుదైన అవకాశం కలిగింది. భక్తులు ఈ శుభదినాన విష్ణు సహస్రనామ పారాయణతో పాటు శివాభిషేకం చేయడం అభీష్ట సిద్ధి పొందుతారు’ అని అంటున్నారు.


