News May 24, 2024

ఈఏపీసెట్.. నేడు బీటెక్ స్ట్రీమ్ ‘కీ’ విడుదల

image

APEAPCET పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇంజినీరింగ్ విభాగంలో 2,74,213 మందికి గాను 2,58,373 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 88,638 మందికి గాను 80,766 మంది పరీక్ష రాసినట్లు సెట్ ఛైర్మన్ తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ విడుదల చేయగా.. 25వ తేదీ ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇంజినీరింగ్ విభాగం కీ ఇవాళ రిలీజ్ చేస్తారు. 26 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

Similar News

News January 13, 2026

గాదె ఇన్నయ్య.. మరోసారి NIA రైడ్స్

image

TG: జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్‌లో గాదె ఇన్నయ్య ‘మా ఇల్లు’ ఆశ్రమంలో NIA మరోసారి రైడ్స్ చేస్తోంది. ఆయన స్వగ్రామం సాగరంలోని ఇంట్లోనూ సోదాలు చేపట్టింది. మావోయిస్టు సానుభూతిపరుడనే ఆరోపణలతో గతంలో ఇన్నయ్యను NIA అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపింది.

News January 13, 2026

రూ.లక్షకుపైగా జీతంతో ఉద్యోగాలు

image

షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నేవీ నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణత, ఫిజికల్ ఎఫిషియన్సీ ఉండాలి. మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1.25 లక్షల జీతం ఉంటుంది. అర్హతగల వారు JAN 24-FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. అధికారిక <>వెబ్‌సైట్‌లో<<>> పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

News January 13, 2026

ఇరాన్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై ప్రభావమెంత?

image

ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై <<18842223>>25% టారిఫ్<<>> విధిస్తామని అమెరికా ప్రకటించింది. ఇది భారత్‌కూ వర్తిస్తుంది. ఇప్పటికే రష్యాతో చమురు కొనుగోలు వల్ల US మనపై 50% సుంకాలు బాదుతోంది. తాజాగా ఇరాన్ ఎఫెక్ట్ కూడా పడితే మొత్తంగా అగ్రరాజ్యానికి మనం చేసే ఎగుమతులపై 75% టారిఫ్‌లు కట్టాల్సి వస్తుంది. టెహ్రాన్‌లోని ఎంబసీ లెక్కల ప్రకారం.. భారత్-ఇరాన్ మధ్య $1.68B (దాదాపు రూ.15,150 కోట్లు) బైలేటరల్ ట్రేడ్ కొనసాగుతోంది.