News December 16, 2024
జర్మనీలో ముందస్తు ఎన్నికలు.. అవిశ్వాస తీర్మానంలో ఓడిన షోల్జ్

అవిశ్వాస తీర్మానంలో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఓటమి పాలయ్యారు. దీంతో Feb 23న ఆ దేశంలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ రాజకీయ స్థిరత్వం కోసం షోల్జ్ ఈ ఓటమిని స్వయంగా కోరుకోవడం గమనార్హం. Novలో 3 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కూలడంతో విపక్షాల మద్దతుతోనే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దేశ రాజకీయ దిశను ఇప్పుడు ఓటర్లే నిర్ణయిస్తారని షోల్జ్ పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<