News March 27, 2025

TGలో ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ.. ఎక్కడంటే?

image

TG: రాష్ట్రంలో కొత్తగా ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీని ఎర్త్‌సైన్స్ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేయనుంది. వారం రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు విడుదల కానున్నాయి. వర్సిటీ ఏర్పాటుకు రూ.500 కోట్ల నిధులతో పాటు 100 పోస్టులు అవసరమని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

Similar News

News March 30, 2025

నేడు IPLలో డబుల్ హెడర్

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3.30 గంటలకు విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలో DC-SRH మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా తొలి మ్యాచులో RRపై గెలిచిన SRH రెండో మ్యాచులో LSGపై ఓటమిపాలైంది. ఈ మ్యాచులో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇవాళ రాత్రి 7.30 గంటలకు గువాహతిలో RR-CSK మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. బోణీ కొట్టాలని RR, విజయం సాధించాలని CSK యోచిస్తున్నాయి.

News March 30, 2025

పట్టణ తలసరి వ్యయంలో తెలంగాణనే టాప్

image

TG: పట్టణ తలసరి వ్యయంలో దేశంలోనే TG అగ్రస్థానంలో నిలిచినట్లు కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 తెలిపింది. రాష్ట్రంలోని గ్రామాల్లో నెలవారీ వ్యయం రూ.4,122 ఉండగా, పట్టణాల్లో రూ.6,199గా ఉన్నట్లు వెల్లడించింది. కేరళలో గ్రామీణ నెలవారీ వ్యయం రూ.6,611గా ఉంది. పట్టణాల్లో విద్యకు నెలకు రూ.183, అద్దె-661, వైద్యం-రూ.426, మద్యం, పాన్-రూ.320, కూల్ డ్రింక్స్, చిప్స్ కోసం రూ.33 ఖర్చు చేస్తున్నట్లు వివరించింది.

News March 30, 2025

కాల్పుల విరమణకు హమాస్ ఓకే

image

ఈజిప్ట్, ఖతార్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ అంగీకరించినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఖలీల్ అల్ హయ్యా తెలిపారు. ఇందుకు ఇజ్రాయెల్ కూడా ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నామన్నారు. వారానికో ఐదు మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసేందుకు మధ్యవర్తులు ప్రతిపాదన పంపినట్లు సమాచారం. అమెరికాతో చర్చల అనంతరం దీనిపై ఇజ్రాయెల్ ఓ నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

error: Content is protected !!