News May 10, 2024

మట్టిపాత్రలే సూపర్ సేఫ్: NIN

image

వంటలకు మట్టిపాత్రలను వాడటమే సురక్షితమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వెల్లడించింది. మట్టిపాత్రల్లో వంటతో తక్కువ ఆయిల్ ఖర్చు, ఆహారంలోని పోషకాలు పోకుండా ఉండటం సహా పర్యావరణ హితమని పేర్కొంది. ‘ఇత్తడి, రాగి వంటి పాత్రల్లో వంట అంత సేఫ్ కాదు. 170 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ హీటయ్యే నాన్‌స్టిక్ ప్యాన్స్ ప్రమాదకరం. పాత్రపై కోటింగ్ డామేజ్ అయితే వాటిని వినియోగించకపోవడం మంచిది’ అని సూచించింది.

Similar News

News March 21, 2026

తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు: సీఎం

image

AP: తిరుమలలో భక్తులకు అందే సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని CM CBN అధికారులను ఆదేశించారు. TTD పరిధిలోని ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. బోర్డు సభ్యులు, అధికారులతో సమీక్షలో మాట్లాడుతూ ‘తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టాలి. అత్యాధునిక CCTVలు, ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.

News March 21, 2026

యుద్ధం.. ఇరాన్‌కు లాభాలు!

image

యుద్ధం వల్ల ఇరాన్‌కు నష్టాలతో పాటు లాభాలూ కలుగుతున్నాయి. గత 40 ఏళ్లుగా క్రూడాయిల్ అమ్మకుండా ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ప్రపంచంలో ఆయిల్ సంక్షోభం తలెత్తడంతో అమెరికా దిగివచ్చి వాటిని ఎత్తివేసింది. ఆయిల్ అమ్ముకోవచ్చంది. ఇక హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే షిప్పులకు గతంలో ఎలాంటి ఫీజు లేకపోయేది. ఇప్పుడు ఇరాన్ ఒక్కో నౌకకు ఆయిల్ ట్యాంకర్ కంపెనీల నుంచి 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తోంది.

News March 21, 2026

‘ధురంధర్-2’పై దీపిక సైలెన్స్ ఎందుకు?

image

‘ధురంధర్-2’పై రణ్‌వీర్ భార్య, హీరోయిన్ దీపికా పదుకొణె స్పందించకపోవడంపై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. భర్త విజయాలను అభినందించడంలో ముందుండే ఆమె ఈసారి ప్రీమియర్లకూ దూరంగా ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధురంధర్ ఫస్ట్ పార్ట్‌కు ఇన్‌స్టాలో ప్రశంసించిన దీపిక ఇప్పుడు SM సైలెన్స్‌ వెనక రీజన్ ఏంటా అని చర్చించుకుంటున్నారు. కాగా దీపిక ఇటీవల రణ్‌వీర్ తల్లి, సోదరితో ముంబైలోని ఓ కన్సర్ట్‌లో మెరిశారు.