News April 1, 2025

భూకంపం.. మయన్మార్‌లో 2,719 మంది మృతి

image

భూకంప విలయానికి మయన్మార్‌లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 2,719 మంది బాడీలు దొరికినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వారిలో ఐదేళ్లలోపు చిన్నారులు 50 మంది దాకా ఉన్నారని తెలిపాయి. 4,521 మంది గాయపడగా, ఇంకా 441 మంది ఆచూకీ దొరకాల్సి ఉందని పేర్కొన్నాయి. కాగా శిథిలాల కింద మృతదేహాలు వెలికితీయడం ఆలస్యం కావడంతో పలు చోట్ల దుర్వాసన వెలువడుతోంది.

Similar News

News April 3, 2025

IPL: ఆర్సీబీ ఓటమి

image

బెంగళూరులో ఆర్సీబీతో మ్యాచ్‌లో170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 2 వికెట్ల నష్టానికి సునాయాస విజయాన్ని సాధించింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 49), బట్లర్(39 బంతుల్లో 73) రాణించడంతో 17.5 ఓవర్లలోనే స్కోర్ ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్‌వుడ్ చెరో వికెట్‌ తీసుకున్నారు.

News April 3, 2025

మారుతీ కార్లు కొనేవారికి షాక్

image

ఏప్రిల్ 8 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.62,000 వరకు ఈ పెంపు ఉంటుందని తెలిపింది. ముడి సరకుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడం, కార్లలో మెరుగైన ఫీచర్స్ ఇందుకు కారణమని తెలిపింది. మోడళ్లపై ధరల పెరుగుదల ఇలా ఉంది. SUV Fronx-Rs.2500, Dzire Tour S-Rs.3000, XL6, Ertiga-Rs.12,500, Wagon R-Rs.14000, Eeco van-Rs.22,500, SUV Grand Vitara-Rs.62,000.

News April 3, 2025

IPL: టాప్‌-3లో ధోనీ, కోహ్లీ, రోహిత్

image

మార్చిలో Xలో అత్యధికంగా ప్రస్తావించిన ఐపీఎల్ ప్లేయర్ల లిస్టులో CSK మాజీ కెప్టెన్ ధోనీ తొలి స్థానంలో నిలిచారు. నెటిజన్లు గత నెలలో ఆయన గురించే ఎక్కువగా చర్చించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, SRH హిట్టర్ ట్రావిస్ హెడ్ ఉన్నారు.

error: Content is protected !!