News December 4, 2024

ఒకే ప్రాంతంలో మూడేళ్లుగా భూకంపం!

image

తెలంగాణలోని ములుగులో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో గత మూడేళ్లుగా సంభవించిన భూకంపాల్లో ప్రతి ఏటా ఒకే ప్రాంతంలో ములుగు చుట్టు పక్కన భూమి కంపించడాన్ని గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అక్కడ ఈసారి కాస్త బలంగా వచ్చినట్లు వెల్లడించారు. గడ్చిరోలి సమీపంలో 2021లో 4.0, 2022లో 3.8, 2023లో భద్రాద్రిలో 3.6 తీవ్రతతో భూకంపాలు వచ్చాయన్నారు.

Similar News

News March 19, 2026

తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయంటే?

image

నారద మహర్షి ఓసారి ఐహిక సుఖాలకు ఆకర్షితుడై స్త్రీ రూపాన్ని ధరించి ఓ రాజును పెళ్లాడి 60 మంది సంతానాన్ని పొందుతారు. తాను బ్రహ్మర్షి అని మరచిన నారదుడికి కనువిప్పు కలిగించడానికి విష్ణువు నిర్ణయిస్తారు. ఆయన మాయతో 60 మంది పుత్రులూ మరణిస్తారు. దీంతో తన సంతానం పేర్లు ఎప్పటికీ నిలిచిపోవాలని నారదుడు కోరతారు. ఆ 60 మంది పేర్లే తెలుగు సంవత్సరాల పేర్లుగా వ్యవహరిస్తున్నామని ఓ కథ ప్రచారంలో ఉంది.

News March 19, 2026

పిల్లలు తనకు పుట్టలేదన్న భర్త.. DNA టెస్టుకు కోర్టు నిరాకరణ

image

AP: భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించడానికి తన ఇద్దరు పిల్లలకు DNA పరీక్ష నిర్వహించాలంటూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న వాదనను తోసిపుచ్చింది. ఇది పిల్లల గౌరవానికి సంబంధించిన అంశమని, బలమైన కారణం లేకుండా DNA టెస్టుకు ఆదేశించలేమని తేల్చి చెప్పింది. భార్య తనను విడిచి వెళ్లిందని తొలుత భర్త విడాకుల పిటిషన్ వేశారని, అక్రమ సంబంధం గురించి కాదని పేర్కొంది.

News March 19, 2026

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

image

సాధారణ అర్థంలో పరాభవ అంటే అవమానం, ఓటమి. దీని ప్రకారం ఈ సంవత్సరమంతా అపజయాలు ఉంటాయని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడేవారికి విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పరా-అమ్మవారు, భవ-ఉండు/ఆవిర్భావం/శివుడు అనే అర్థం. అంటే అమ్మవారికి సమీపాన ఉండటం లేదా పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు’ అని పేర్కొంటున్నారు.