News February 25, 2025
కోల్కతా, భువనేశ్వర్ సమీపంలో భూకంపం

కోల్కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.1గా భూకంప తీవ్రత నమోదైంది. కోల్కతాతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఒడిశాకు 175కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా, దీని ప్రభావం బంగ్లాదేశ్లోనూ కనిపించింది.
Similar News
News February 25, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు మస్క్ వార్నింగ్.. ట్రంప్ మద్దతు

అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులకు డోజ్ చీఫ్ మస్క్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత వారం చేసిన పనులను రెండు రోజుల్లో చెప్పాలని, లేకపోతే రిజైన్ చేయాలని ఎక్స్లో పోస్టు పెట్టగా దాన్ని పట్టించుకోవద్దని ట్రంప్ యంత్రాంగం భరోసానిచ్చింది. అయితే మస్క్ వ్యాఖ్యలకు అధ్యక్షుడు ట్రంప్ మద్దతిచ్చారు. ఉద్యోగులు చేస్తున్న పని గురించి మస్క్ ప్రశ్నిస్తున్నారని, దానికి సమాధానం ఇవ్వాలని వారికి సూచించారు.
News February 25, 2025
ఏనుగుల దాడి.. మృతులకు రూ.10 లక్షల పరిహారం

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి<<>> ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News February 25, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్

నిన్న నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ ఇవాళ పుంజుకుంటోంది. సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి 74,571 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 22,584 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్ లాభాల్లో కొనసాగుతుండగా సన్ ఫార్మా, హిందాల్కో, కోల్ ఇండియా, లార్సెన్ నష్టాల్లో ఉన్నాయి.