News December 4, 2024

భూకంపం టెన్షన్.. అదే కారణమా?

image

ఈ ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల ధాటికి ములుగు జిల్లా మేడారం అడవుల్లో సుమారు 85వేల చెట్లు నేలకూలాయి. వీటిలో 50-100 ఏళ్ల మహావృక్షాలు కూడా ఉన్నాయి. ఇవాళ అదే ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం రావడంతో చెట్లు కూలడమే ఇందుకు కారణమా అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ అడవి సమీపంలో గోదావరి ప్రవహిస్తుండటం, బొగ్గు గనులు ఉండటంతో దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Similar News

News April 6, 2026

గ్యాస్ సిలిండర్ దొరకట్లేదా? ఇది ఈజీగా పొందొచ్చు

image

నగరాలు, పట్టణాల్లోని వలస కార్మికులు, విద్యార్థుల కోసం 5 కేజీల FTL సిలిండర్ల పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా వీటిని పొందవచ్చని విస్తృత ప్రచారం చేస్తోంది. ఆథరైజ్డ్ గ్యాస్ డీలర్ వద్దకు వెళ్లి ఏదైనా ఒక వ్యాలిడ్ ఐడీ కార్డు చూపిస్తే చాలని తెలిపింది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.6 లక్షల సిలిండర్లను డెలివరీ చేసినట్లు వివరించింది.

News April 6, 2026

దేశాభివృద్ధికి కట్టుబడిన పార్టీ BJP: చంద్రబాబు

image

AP: BJP 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా AP CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి కట్టుబడిన ఆ పార్టీ విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకెళ్తోందన్నారు. కష్టకాలంలోనూ సమర్థమైన విధానాలతో దేశ రాజకీయాల్లో BJP తనదైన ముద్ర వేసిందని ప్రశంసించారు. అమరావతి నిర్మాణం సహా ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని BJP ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.

News April 6, 2026

గుడ్‌న్యూస్.. రాష్ట్రం నుంచి మరో 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు

image

AP: దక్షిణాదిన కేంద్రం నిర్మించే 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్రం మీదుగా వెళ్లనున్నాయి. అమరావతి నుంచి గుంటూరు, చీరాల, నెల్లూరు, నాయుడుపేట, శ్రీ సిటీ మీదుగా హైదరాబాద్-చెన్నై కారిడార్.. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారుపేట, బెంగళూరు, మండ్య మీదుగా మైసూరు-చెన్నై కారిడార్‌ ఏర్పాటు కానున్నాయి. తొలుత హైదరాబాద్-చెన్నై కారిడార్‌లో మాత్రమే అమరావతిని కేంద్రం చేర్చింది.