News September 25, 2024
Ease of Business: డీక్రిమినలైజ్ కోసం 300 లా పాయింట్లు షార్ట్లిస్ట్
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు బూస్ట్ ఇచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 300 లా పాయింట్లు, సెక్షన్లను షార్ట్లిస్ట్ చేసింది. వివిధ మంత్రిత్వ శాఖల్ని సంప్రదించి వీటిలో సగం వరకు డీక్రిమినలైజ్ చేస్తామని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. జన్ విశ్వాస్ 2.0 కింద కంపెనీలపై రూల్స్ ఒత్తిడి తగ్గిస్తామన్నారు. ప్రతి ఎలక్ట్రానిక్ డివైజులో మేకిన్ ఇండియా పరికరం ఉండాలన్నదే తమ గోల్ అని చెప్పారు.
Similar News
News September 25, 2024
హైడ్రా బాధితులకు అండగా ఉంటాం: KTR
TG: హైడ్రా బాధితులందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR భరోసా ఇచ్చారు. న్యాయపరంగా ఎలాంటి అవసరం ఉన్నా తెలంగాణ భవన్కు వచ్చి వివరాలు అందించాలని సూచించారు. ఇక హైదరాబాద్లో ఆక్రమణల తొలగింపు ఉద్దేశం మంచిదే అయినా ముందు వాళ్లకు వేరేచోట ఆవాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ‘అలా కాకుండా ఉన్నపళంగా ఫుట్పాత్లపై ఏర్పాటు చేసుకున్న పేదల దుకాణాలను కూల్చేయడం సరికాదు’ అని KTR మండిపడ్డారు.
News September 25, 2024
కార్తీ ఫ్యామిలీకి ఇవి అలవాటే: నటి కస్తూరి
తిరుమల లడ్డూపై హీరో కార్తీ చేసిన <<14180101>>వ్యాఖ్యలపై<<>> సీనియర్ నటి కస్తూరి స్పందించారు. ‘కార్తీ కుటుంబం సనాతన పద్ధతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేంకాదు. శబరిమలపై శివకుమార్ వ్యాఖ్యలు, ఆలయాల కంటే ఆస్పత్రులపై ఎక్కువ దృష్టి పెట్టాలని జ్యోతిక చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులు ఇలాంటివి సహించరు. ఆంధ్రాలో హిందూ వ్యతిరేకతను స్వాగతించరు’ అని ట్వీట్ చేశారు.
News September 25, 2024
మద్యం షాపులు ఖాళీ.. మందుబాబుల ఆవేదన
AP: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి నూతన మద్యం పాలసీ కింద తక్కువ ధరకే లిక్కర్ అందుబాటులోకి రానున్న వేళ మందుబాబులకు కొత్త చిక్కొచ్చి పడింది. చాలా మద్యంషాపులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. డిపోల నుంచి సరఫరా నిలిపివేయడంతో పాటు ఉన్న నిల్వలను అమ్మాలని ఆదేశాలుండటంతో షాపులన్నీ ఖాళీ అయ్యాయి. కొన్ని ఖరీదైన బ్రాండ్లే అందుబాటులో ఉండటంతో తమకు ఇబ్బందిగా మారిందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.