News February 19, 2025
CMRF చెక్కుల పంపిణీకి ఈసీ బ్రేక్

TG: రాష్ట్రంలో CMRF నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేకులు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మార్చి 4 వరకు లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేయవద్దని స్పష్టం చేసింది. కాగా తెలంగాణలోని 33 జిల్లాలకు 24 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అన్ని జిల్లాల్లో చెక్కుల పంపిణీ నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.
Similar News
News December 14, 2025
ఒక్క ఓటు తేడాతో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితాలు వెలువడ్డాయి. కామారెడ్డి (D) గాంధారి (M) పొతంగల్ఖుర్ద్లో పంచాయతీ ఎన్నిక కౌంటింగ్లో స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్ ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. సంతోష్కు 278 ఓట్లు, అతని సమీప ప్రత్యర్థికి 277 ఓట్లు వచ్చాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం (D) అశ్వారావుపేట (M) పాత రెడ్డిగూడెంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఉమ్మలా వెంకటరమణ 2 ఓట్ల తేడాతో గెలుపొందారు.
News December 14, 2025
భారత్ బౌలింగ్.. బుమ్రా స్థానంలో హర్షిత్

సౌతాఫ్రికాతో ధర్మశాలలో జరిగే మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్టార్ పేసర్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
భారత్: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, దూబే, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
News December 14, 2025
దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే: ఖర్గే

ఓట్ చోరీకి పాల్పడే వారు ద్రోహులని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైరయ్యారు. ఓటు హక్కు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే BJPని అధికారం నుంచి దింపేయాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ భావజాలాన్ని బలోపేతం చేయడం భారతీయుల బాధ్యత. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. RSS ఐడియాలజీ దేశాన్ని నాశనం చేస్తుంది’ అని ఆరోపించారు. తన కొడుక్కు ఆపరేషన్ ఉన్నా వెళ్లలేదని, 140 కోట్ల మందిని కాపాడటమే ముఖ్యమని ర్యాలీకి వచ్చానని తెలిపారు.


