News February 19, 2025
CMRF చెక్కుల పంపిణీకి ఈసీ బ్రేక్

TG: రాష్ట్రంలో CMRF నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేకులు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మార్చి 4 వరకు లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేయవద్దని స్పష్టం చేసింది. కాగా తెలంగాణలోని 33 జిల్లాలకు 24 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అన్ని జిల్లాల్లో చెక్కుల పంపిణీ నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.
Similar News
News December 3, 2025
చిట్యాల: చిచ్చు పెట్టిన ఎన్నికలు.. మహిళ సూసైడ్

చిట్యాల (M) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదంగా మారింది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను బీఆర్ఎస్ బలపరిచింది. ఆమె కూతురిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ నేపథ్యంలో కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. అల్లుడు బండ మచ్చ టార్చర్ను తట్టుకోలేక లక్ష్మమ్మ (50) సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 3, 2025
భారీ ఎన్కౌంటర్.. 15 మంది మృతి

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్కౌంటర్లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
News December 3, 2025
త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: రేవంత్

TG: 2023 DEC 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని CM రేవంత్ అన్నారు. ‘శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదేరోజు జరిగింది. ఆయన స్ఫూర్తితో 60వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మరో 40వేల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని 2004లో కరీంనగర్లో సోనియా ప్రత్యేక రాష్ట్రంపై మాటిచ్చారన్నారు.


