News April 5, 2024

ఆ ప్రాంతాలపై ఈసీ ఫోకస్

image

తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న 11 రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనికి గల కారణాలపై CEC రాజీవ్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బిహార్, UP, ఢిల్లీ, ఉత్తరాఖండ్, TG, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 2019లో 67.40శాతం ఓటింగ్ నమోదైంది. ఈ రాష్ట్రాల్లో పట్టణాల్లో అత్యంత తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు గుర్తించారు.

Similar News

News November 26, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేట్ రూ.870 ఎగబాకి రూ.1,27,910కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.800 పెరిగి రూ.1,17,250గా నమోదైంది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.2వేలు పెరిగి రూ.1,76,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News November 26, 2025

ఆకుకూరల సాగుకు అనువైన రకాలు

image

ఆకుకూరల్లో చీడపీడలను తట్టుకొని, తక్కువ కాలంలో అధిక దిగుబడులను ఇచ్చే రకాలను సాగు చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.
☛ తోటకూర: RNA-1, అర్కా సుగుణ, అర్కా అరుణిమ ఇవి ఎరుపు రకాలు. VARNA(VRA-I)
☛ పాలకూర: ఆల్ గ్రీన్, పూస జ్యోతి, అర్క అనుపమ, పూస పాలక్, జాబ్నర్ గ్రీన్
☛ గోంగూర: ANGRAU-12, ఎర్ర గోంగూర రకాలు: AMV-4, AMV-5, AMV-7
☛ మెంతికూర: పూస ఎర్లి బంచింగ, లామ్ సెలక్షన్-1, లామ్ మెంతి-2, లామ్ సోనాలి.

News November 26, 2025

సౌతాఫ్రికాతో టెస్ట్.. భారత్ 4 వికెట్లు డౌన్

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో IND ఓటమి దిశగా పయనిస్తోంది. 27/2 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన IND మరో 2 వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్‌మన్ కుల్దీప్(5) బౌల్డ్ కాగా, ఆ తర్వాత వచ్చిన జురెల్(2) ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీంతో భారత్ 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు సాయి సుదర్శన్ కూడా ఔట్ కాగా నోబాల్ కావడంతో బతికిపోయాడు.