News December 4, 2024
శీతాకాలంలో వీటిని తింటున్నారా?

చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనెలో వేయించిన పకోడీ, బజ్జీ, సమోసాలు తింటే అరుగుదల కష్టంగా మారుతుంది. జున్ను, పాల ఉత్పత్తులు తీసుకుంటే సైనసైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. మటన్, బీఫ్, పోర్క్ తింటే జీర్ణం కాక కడుపు ఉబ్బరంగా ఉంటుంది. పానీ పూరీ, చాట్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తాయి. మసాలా, నిల్వ పచ్చళ్లకు దూరంగా ఉండటం బెటర్.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


