News March 26, 2024

గుడ్లు ఎక్కువగా తింటున్నారా?

image

రోజుకో గుడ్డు తినాలని వైద్యులు చెబుతున్నారు. గుడ్లు ఎక్కువగా తింటే మరీ మంచిదని అంటున్నారు. గుడ్లు తినడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు కూడా రావని పేర్కొంటున్నారు. అలాగే గుడ్డు తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయని.. గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. తొడ, కటి వెన్నెముక భాగాల్లోని ఎముకలు దృఢంగా మారతాయని అంటున్నారు. గుడ్డు తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని పేర్కొంటున్నారు.

Similar News

News January 17, 2026

నేటి ముఖ్యాంశాలు

image

✴ 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం రేవంత్
✴ ఉమ్మడి ఆదిలాబాద్‌లో సదర్మట్, చనాక-కొరాటా బ్యారేజీలను ప్రారంభించిన సీఎం
✴ మేడారంలో ఒక్కరోజే 6 లక్షల మంది భక్తుల దర్శనం
✴ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
✴ ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్
✴ రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు?: జగన్
✴ ‘సంక్రాంతి’ తిరుగు ప్రయాణాలు.. బస్సులు, రైళ్లలో రద్దీ

News January 17, 2026

WPL: RCB హ్యాట్రిక్ విజయం

image

WPLలో ఆర్సీబీ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌ తడబడినా రాధా యాదవ్‌ 66 పరుగులతో జట్టును నిలబెట్టారు. రిచా ఘోష్‌ 44 పరుగులతో మద్దతు ఇవ్వగా, చివర్లో క్లర్క్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఛేజింగ్‌లో గుజరాత్‌ 150 పరుగులకు పరిమితమైంది. శ్రేయాంక పాటిల్ 5 వికెట్లు తీశారు.

News January 17, 2026

ఆ ప్లేయర్‌ను చివరి వన్డేలోనైనా ఆడించండి: అశ్విన్

image

న్యూజిలాండ్‌తో రెండు వన్డేలకు బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై మాజీ క్రికెటర్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. కనీసం మూడో వన్డేలోనైనా అతడిని ఆడించాలని సూచించారు. అర్ష్‌దీప్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని, జట్టు విజయాల్లో భాగమయ్యాడని తెలిపారు. అయినా టీమ్‌లో స్థానం కోసం పోరాడుతున్నాడని చెప్పారు. బ్యాటర్ల విషయంలో ఇలా జరగదని, ప్రతిసారీ బౌలర్లే బలవుతున్నారని పేర్కొన్నారు.