News March 21, 2025

పచ్చళ్లు అతిగా తింటే క్యాన్సర్ రావొచ్చు!

image

అతిగా పచ్చళ్లు తినడం ప్రమాదకరమని ప్రముఖ వైద్యుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘పచ్చళ్ళలో పెరిగే శిలీంధ్రాలు (బూజు/ఫంగస్) నైట్రేట్లని నైట్రైట్లుగా మారుస్తాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. అప్పుడప్పుడూ తిన్నవారిని ఇవేం చేయలేవు. కానీ, అదేపనిగా తింటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ ఇది ప్రమాదకరమే. నిలువ పచ్చళ్ల కంటే అప్పుడే చేసిన రోటి పచ్చళ్లు సేఫ్’ అని తెలిపారు.

Similar News

News March 22, 2025

రాత్రి పూట త్వరగా నిద్ర పట్టడం లేదా?

image

చాలా మందికి రాత్రి పూట నిద్రపట్టక సతమతమవుతుంటారు. కానీ కొన్ని అలవాట్లు పాటిస్తే త్వరగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు బాదం పాలు తాగితే త్వరగా నిద్ర పడుతుంది. గంట ముందు చెర్రీ రసం తాగితే అందులో ఉండే మెలటోనిన్ హాయిగా నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. గ్లాసు పసుపు పాలు తాగినా సుఖ నిద్ర పడుతుంది. కాఫీ, టీలు అస్సలు తాగకూడదు. ఇతర పనుల గురించి ఆలోచించకుండా ఉంటే వెంటనే నిద్ర పడుతుంది.

News March 21, 2025

వచ్చే ఏడాది పోలవరం పూర్తి: సీఆర్ పాటిల్

image

పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, మోదీ వచ్చాక ₹15K కోట్లు కేటాయించారని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. ఈ ఏడాదీ ₹12K కోట్లు ఇచ్చారని తెలిపారు. 2026 కల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. దీంతో 2.91 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని, విశాఖతో పాటు 540 గ్రామాలకు తాగు నీరు లభిస్తుందని చెప్పారు. 28.5 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

News March 21, 2025

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ వెబ్ సిరీస్

image

క్రైమ్ థ్రిల్లర్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా జీత్, ప్రోసెన్‌జీత్ ఛటర్జీ, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగద కీలక పాత్రల్లో నటించారు. 2022లో వచ్చిన ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్టవడంతో నెట్‌ఫ్లిక్స్ పార్ట్-2 తెరకెక్కించింది.

error: Content is protected !!