News May 24, 2024

ఈసీని అలా ఆదేశించలేం: SC

image

ఓటింగ్ సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాలని ఈసీని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకు భారీగా ఉద్యోగులు అవసరమవుతారని పేర్కొంది. ఇప్పటికే 5 దశల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అది సాధ్యం కాదంది. ఎన్నికల తర్వాత సాధారణ బెంచ్ విచారణ చేస్తుందని వెల్లడించింది. కాగా పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్లో ఉంచేలా ఆదేశించాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం SCలో పిటిషన్ వేసింది.

Similar News

News December 20, 2025

దేశంలో అతి తక్కువ ఫెర్టిలిటీ రేటు ఎక్కడంటే?

image

భారత్‌లో టోటల్ ఫెర్టిలిటీ రేటు అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా సిక్కిం (1.1) నిలిచింది. బిహార్‌లో(3.0) అత్యధిక ఫెర్టిలిటీ రేటు ఉంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్నట్లు కేంద్రం ఇటీవల వెల్లడించింది. ఈ అంశంలో జాతీయ సగటు 2.0 కాగా అంతకంటే తక్కువగా TGలో 1.8, APలో 1.7గా ఉంది. అంటే ఒక మహిళ తన లైఫ్ టైమ్‌లో సగటున ఇద్దరి కంటే తక్కువ మందికి జన్మనిస్తోందని అర్థం.

News December 20, 2025

మల్లన్న భక్తులకు ఊరట

image

శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనాల సమయం పెంచుతున్నట్లు ప్రకటించడం భక్తులకు ఊరటనిచ్చే విషయం. జనవరి నుంచి వీకెండ్స్‌లో 6 స్లాట్లలో భక్తులకు లింగాన్ని తాకి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని EO వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆది, సోమవారాల్లో 7am-8:30am, 11:45am-2pm, 9pm-11pm స్లాట్లలో స్పర్శ దర్శనం ఉంటుంది. HYD, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఫ్యామిలీస్ వీకెండ్‌లో ఎక్కువగా వెళ్తున్నారు.

News December 20, 2025

వరి సన్నాలు పండించిన రైతులకు బోనస్ జమ

image

TG: ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో వరి సన్నాలను పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున రూ.649.84 కోట్లను విడుదల చేసింది. ఈ ఏడాది వానాకాలంలో 30.35 లక్షల టన్నుల సన్నవడ్లను సర్కారు సేకరించింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ జమైంది.