News May 24, 2024
ఈసీని అలా ఆదేశించలేం: SC

ఓటింగ్ సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఈసీని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకు భారీగా ఉద్యోగులు అవసరమవుతారని పేర్కొంది. ఇప్పటికే 5 దశల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అది సాధ్యం కాదంది. ఎన్నికల తర్వాత సాధారణ బెంచ్ విచారణ చేస్తుందని వెల్లడించింది. కాగా పూర్తి సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచేలా ఆదేశించాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం SCలో పిటిషన్ వేసింది.
Similar News
News December 16, 2025
AP న్యూస్ అప్డేట్స్

* మిషన్ వాత్సల్య పథకం కింద మహిళలు, పిల్లల సంరక్షణకు 53 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి.
* ఖరీఫ్ సీజన్లో 51L టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే 24.32L టన్నుల సేకరణ పూర్తి. 3.70 లక్షల మంది ఖాతాల్లోకి రూ.5,544 కోట్లు జమ.
* ఎరువుల డీలర్లు కృత్తిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లించినా, ఎక్కువ ధరకు విక్రయించినా లైసెన్సులు రద్దు, కఠిన చర్యలు: వ్యవసాయ శాఖ
News December 16, 2025
40 ఏళ్లు నిండాయా? ఈ టెస్టులు చేయించుకోండి

40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో హార్మోన్ మార్పులు, నెలసరి సమస్యలు, మెనోపాజ్ వేధిస్తుంటాయి. తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వారు కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏడాదికోసారి ఫుల్ బాడీ చెకప్, షుగర్, BP, కొలెస్ట్రాల్, థైరాయిడ్ టెస్టులు, 2-3 ఏళ్లకోసారి సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, బోన్ హెల్త్ టెస్టు, 1-2 ఏళ్లకు కంటి, డెంటల్ పరీక్షలు, మెంటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
News December 16, 2025
నేడు, రేపు స్కూళ్లకు సెలవు

TG: రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైన స్కూళ్లలో ఇవాళ, రేపు సెలవు ఉండనుంది. ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నారు. కాగా మూడో(తుది) విడతలో 4,158 సర్పంచ్, 36,434 వార్డు స్థానాలకు 394 సర్పంచ్, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది.


