News February 18, 2025
జగన్ పర్యటనకు EC అనుమతి నిరాకరణ

AP: YCP అధినేత జగన్ రేపు ఉ.10.30గంటలకు గుంటూరులోని మిర్చి యార్డుకు వెళ్లి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులకు అండగా నిలబడతారని ఆ పార్టీ ట్వీట్ చేసింది. పెట్టుబడి రాలేదని మిర్చి రైతులు దిగాలు చెందారని, వారితో మాట్లాడి భరోసా కల్పిస్తారని పేర్కొంది. మిర్చి రైతులకు కూటమి ప్రభుత్వం కన్నీరు మిగిల్చిందని ఆరోపించింది. అయితే MLC ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జగన్ పర్యటనకు ఈసీ అనుమతి నిరాకరించింది.
Similar News
News October 27, 2025
మరోసారి భారత్ను రెచ్చగొట్టిన బంగ్లా చీఫ్

బంగ్లా చీఫ్ యూనస్ మరోసారి భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పాక్ ఆర్మీ జనరల్కు ఆయన ప్రజెంట్ చేసిన బుక్ దుమారం రేపింది. ఆ బుక్ కవర్ పేజీపై అస్సాం సహా ఇతర నార్త్ఈస్ట్ రాష్ట్రాలను బంగ్లాలో భాగంగా చూపారు. ర్యాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ డిమాండ్ చేస్తున్న ‘గ్రేటర్ బంగ్లాదేశ్’కు యూనస్ మద్దతిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కొంతకాలంగా ఆయన నార్త్ఈస్ట్ స్టేట్స్పై అభ్యంతరకర కామెంట్స్ చేయడం తెలిసిందే.
News October 27, 2025
14,582 పోస్టులు… ఫలితాలు ఎప్పుడంటే…

SSC CGL టైర్1 ఫలితాల విడుదల తేదీపై అభ్యర్ధులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నవంబర్ చివరి వారంలో ఈ రిజల్ట్స్ను ప్రకటించవచ్చని కమిషన్ వర్గాలను ఉటంకిస్తూ టైమ్స్ నౌ పేర్కొంది. NOV25న వచ్చే అవకాశముందని వివరించింది. ఈ పరీక్షల ప్రైమరీ కీపై అక్టోబర్ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. వీటిని పరిష్కరించి ఫలితాలు ప్రకటిస్తారు. సెప్టెంబర్లో జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది హాజరయ్యారు.
News October 27, 2025
RAC సీట్లకు సగం ఛార్జీలు తిరిగి చెల్లించాలని డిమాండ్!

రైళ్లలో RAC ఛార్జీలపై ప్రయాణికులు SM వేదికగా విమర్శలు చేస్తున్నారు. సగం సైడ్ లోవర్ బెర్త్కు పూర్తి ఛార్జీ వసూలు చేయడం అన్యాయమని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు నిద్ర లేకుండా ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్ట్ తయారైన వెంటనే RAC ప్రయాణికులకు సగం డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని అమలు చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?


