News February 18, 2025

జగన్ పర్యటనకు EC అనుమతి నిరాకరణ

image

AP: YCP అధినేత జగన్ రేపు ఉ.10.30గంటలకు గుంటూరులోని మిర్చి యార్డుకు వెళ్లి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులకు అండగా నిలబడతారని ఆ పార్టీ ట్వీట్ చేసింది. పెట్టుబడి రాలేదని మిర్చి రైతులు దిగాలు చెందారని, వారితో మాట్లాడి భరోసా కల్పిస్తారని పేర్కొంది. మిర్చి రైతులకు కూటమి ప్రభుత్వం కన్నీరు మిగిల్చిందని ఆరోపించింది. అయితే MLC ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జగన్ పర్యటనకు ఈసీ అనుమతి నిరాకరించింది.

Similar News

News January 23, 2026

IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

IBPS ఆర్ఆర్‌బీ క్లర్క్‌ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు. 8,002 పోస్టుల భర్తీకి డిసెంబర్ 6,7,3,14 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News January 23, 2026

బత్తాయి చెట్లు ఎండిపోతున్నాయా?

image

వేరుకుళ్లు తెగులు సోకినప్పుడు చెట్లు వడలి కాయలు రాలిపోతాయి. దీని నివారణకు 1% బోర్డో మిశ్రమం లేదా 0.2% కార్బండిజమ్(లీటరు నీటికి 2గ్రా. చొప్పున) మిశ్రమం 20 లీటర్లు పాదుల్లో పోయాలి. ఒక్కో చెట్టుకు 10KGల మేర వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరివిడిని చెట్ల పాదుల్లో కలియబెట్టాలి. ట్రైకోడెర్మా రెస్సీ 100గ్రా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 100గ్రా, 2KGల వేప పిండి, 25KGల పశువుల ఎరువుతో కలిపి పాదుల్లో వేసుకోవాలి.

News January 23, 2026

కమ్యూనిస్ట్ గడ్డపై కమలం వికసించేనా?

image

సౌతిండియాలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇటీవల తిరువనంతపురం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంతో కమలం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇవాళ మోదీ పర్యటన కార్యకర్తల్లో మరింత జోష్ నింపింది. వికసిత్ కేరళం అంటూ ఆయన పిలుపునిచ్చారు. దీంతో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల పీఠాన్ని కదిలించి కమలం జెండా ఎగురవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి కేరళలో బీజేపీ అధికారం చేపడుతుందా?